Drinking Water at Night : మానవ శరీర ఆరోగ్యానికి తీసుకునే పదార్థాల్లో క్రమ పద్ధతిగా ఉండాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. మన శరీరంలో 60 శాతానికి పైగా నీరు వండే అవకాశం ఉంటుంది. ఇది తాగితే డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాగని మోతాదుకు మించి నీరు తాగితే కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇటీవల రాత్రి సమయంలో కొందరు నీటిని తీసుకోవాలని సూచిస్తుండగా.. మరికొందరు ఎక్కువ నీరు తాగితే నిద్ర భంగం కలుగుతుందని అంటున్నారు. దీంతో చాలామంది అయోమయానికి గురవుతూ.. అసలు రాత్రి సమయంలో నీరు తాగవద్దా? లేదా? అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై కొందరు వైద్యులు ఏమంటున్నారంటే?
శరీర ఆరోగ్యానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రాత్రి సమయంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. నేటి కాలంలో చాలామంది ఈ సమయంలో రకరకాల ఆహార పదార్థాలు, లిక్కర్ వాటివి తీసుకుంటూ ఉంటున్నారు. అయితే వీటి ద్వారా నీటిని తీసుకోవడం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక నీరు వెళ్లి పదేపదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
వాస్తవానికి రాత్రి సమయంలో కిడ్నీల ఆరోగ్యానికి నీటిని తీసుకోవాలి. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమ పద్ధతిలో నీటిని తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో మాత్రం తక్కువ మోతాదులో గడువు ఏర్పాటు చేసుకుంటూ నీటిని తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ మోతాదులో నీరుని తీసుకోవడం వల్ల నిద్ర భంగం కలిగి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిని తీసుకున్న తర్వాతే నిద్రపోయే ప్రయత్నం చేయాలి. శరీరంలో తగినంత నీరు ఉంటేనే డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
అయితే రాత్రి సమయంలో నీటికి బదులు కూల్ డ్రింక్ లేదా కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల నీరు తీసుకునే అవసరం తగ్గుతుంది. ఫలితంగా పదేపదే మూత్రం వచ్చే అవకాశం ఉంటుంది. నీటి కంటే ఎక్కువగా ఇవి షుగర్ కంటెంట్ ను కలిగి ఉండడం వల్ల.. రాత్రి సమయంలో ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవి కిడ్నీలపై ప్రభావం పడి వాడే అవకాశం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులు స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలని అంటున్నారు.
అలాగే వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా నీటిని తక్కువ తీసుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. అందువల్ల నీటి విషయంలో క్రమ పద్ధతిని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.