Homeఎంటర్టైన్మెంట్Dil Raju comments on Peddi: 'పెద్ది' కి ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అయ్యేలా...

Dil Raju comments on Peddi: ‘పెద్ది’ కి ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అయ్యేలా చూస్తాము – దిల్ రాజు

Dil Raju comments on Peddi: ఎట్టకేలకు గత రెండు మూడు రోజుల నుండి ఎక్సిభిటర్స్ గిల్డ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఏర్పడిన విభేదాలకు నేడు తెరబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ లోని ఎక్సిభిటర్స్ మాకు ఇక నుండి కమీషన్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకుంటేనే సింగల్ స్క్రీన్స్ థియేటర్స్ ని రన్ చేస్తాము , లేదంటే మూసేస్తాము అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి , […]

Dil Raju comments on Peddi: ఎట్టకేలకు గత రెండు మూడు రోజుల నుండి ఎక్సిభిటర్స్ గిల్డ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఏర్పడిన విభేదాలకు నేడు తెరబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ లోని ఎక్సిభిటర్స్ మాకు ఇక నుండి కమీషన్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకుంటేనే సింగల్ స్క్రీన్స్ థియేటర్స్ ని రన్ చేస్తాము , లేదంటే మూసేస్తాము అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి , ఏషియన్ సునీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మొన్న నాగవంశీ , మైత్రీ మూవీ మేకర్స్ రవి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , మేము కమీషన్ బేసిస్ విధానం పై సానుకూలంగానే ఉన్నాము , కానీ ఇది ఒకటి రెండు రోజుల్లో పరిష్కరింపబడే సమస్య కాదు , కూర్చొని మాట్లాడుకోవాలి , మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి , అవన్నిటికి ఒప్పుకుంటేనే మేము ఈ విధానాన్ని స్వాగతిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

నిన్న సాయంత్రం అయితే, తెలంగాణ లో సింగల్ స్క్రీన్స్ ని ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు మూసి వేస్తామని అధికారిక ప్రకటన కూడా చేశారు ఎక్సిభిటర్స్. అయితే నేడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ , ఎక్సిభిటర్స్ గిల్డ్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం మొదలు మామూలు స్థితిలో అవ్వలేదు. నిర్మాత నాగవంశీ , ఏషియన్ సునీల్ ఒకరిని ఒకరు కొట్టుకునేంత పని చేశారు. ఏషియన్ సునీల్ ‘నువ్వు నాశనం చేసేస్తా’ అంటూ నాగవంశీ పై రెచ్చిపోగా, అందుకు నాగవంశీ కోపం అదుపు తప్పి , ఆయనపై చెయ్యి చేసుకునేందుకు ముందుకు దూసుకెళ్లాడు, అప్పుడు ఏషియన్ సునీల్ వద్ద ఎక్సిభిటర్ గా పని చేస్తున్న శ్రీధర్ అడ్డు రావడంతో అతనిపై నాగవంశీ చెయ్యి చేసుకున్నాడు. ఇద్దరు కాసేపు కొట్లాడుకున్నారు కూడా. పరిస్థితి చెయ్యి దాటిపోవడం తో, అల్లు అరవింద్ , దిల్ రాజు కలుగచేసుకొని , ఈ సమావేశాన్ని శాంతియుతంగా ముగించారు.

అనంతరం దిల్ రాజు బయటకు వచ్చి మీడియా తో మాట్లాడుతూ ‘నిర్మాతలు కూడా కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఒక కమిటీ ని ఏర్పాటు చేసి A సెంటర్ లో ఎంత కమీషన్ ఉండాలి , మిగిలిన సెంటర్స్ లో ఎలాంటి కమీషన్ ఉండాలి అనేది నిర్ణయిస్తాము. మా సతీష్ గారు నిర్మించిన ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా స్మూత్ గా విడుదల కాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానుల్లో కలిగిన భయాందోళనకు ఇక్కడితో చెక్ పడింది. జూన్ 3 న అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ లో కూడా భారీ లెవెల్ ప్రీమియర్ షోస్ తో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper