Homeఎంటర్టైన్మెంట్Upasana: మహిళలు ఎగ్స్ దాచుకోవాలంటున్న ఉపాసన.. ఎందుకో తెలుసా?

Upasana: మహిళలు ఎగ్స్ దాచుకోవాలంటున్న ఉపాసన.. ఎందుకో తెలుసా?

Upasana: కొణిదెల ఇంటి కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు సామాజిక కార్యక్రమాలలో ప్రజలకు దగ్గరైంది. ఇదిలా ఉంటే ఈమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా మెటర్నిటీ లీవ్స్ తీసుకునేలా కంపెనీలు అవకాశం కల్పించాలని పేర్కొంది. అంతేకాదు ఆడవాళ్లు తన ఎగ్స్ ను కాపాడుకోవాలని కూడా సూచించింది కొణిదెల కోడలు. వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలంది..

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించాలి అనుకునేవారు తమ ఎగ్స్ దాచుకుంటే మంచిది అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాత పిల్లలను కనే వారికి ఈ ఐడియా బాగా పనిచేస్తుందని తెలిపారు ఉపాసన. తాను కూడా ఇదే విధానాన్ని అనుసరించాను అని.. సరైన సమయం వచ్చినప్పుడే పిల్లలను కన్నాను అని తెలిపింది.రామ్ చరణ్, ఉపాసనలు గత సంవత్సరమే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు. అయితే జూన్ 20 2023న జన్మించింది క్లింకారా.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్.. ఈయన సినిమాలు మంచి హిట్ లతో దూసుకొనిపోతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చెర్రీ. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular