Photo Talk
Photo Talk: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగు సినిమాలే పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కానీ విధంగా మనవాళ్లు ప్రభంజనాలు క్రియేట్ చేస్తూ రావడం నిజంగా ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మన స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కలెక్షన్స్ కొల్లగొట్టడమే మన ఇండస్ట్రీ ని ఇండియా లోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మార్చింది. మరే ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కూడా పాన్ ఇండియా లో కలెక్షన్లు కొల్లగొట్టడం లేదు.
కాబట్టి మన వాళ్ళే ఇప్పటివరకైతే టాప్ పొజిషన్ లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ ను ముగించుకొని వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాలు తొందర్లోనే రిలీజ్ కి కూడా రెడీ అవుతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ముగిసిన తర్వాత ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇక దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక రిషబ్ శెట్టి కూడా కాంతార సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక ఇప్పటికే తను కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ సినిమా లో ఉన్న ఒక కీలక పాత్రని రిషబ్ శెట్టి తో చేయించడానికి ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడట..అందుకే అతన్ని ఎన్టీఆర్ కి పరిచయం చేసి వీళ్లంతా కలిసి ఒక ఫోటో దిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ముందు నుంచే రిషబ్ శెట్టి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం కూడా ఆయన ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్టీఆర్ తో సినిమా అనగానే రిషబ్ శెట్టి ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చేప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్లో సినిమా వచ్చేది నిజమేనా కాదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Prashanth neel movie fix with ntr rishabh shetty
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com