Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ప్రతి ఒక్క డైరెక్టర్ ఎదురు చూడడమే కాకుండా ఆయనకు కథలు చెప్పడానికి చాలా రకాల కథలను కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే చిరంజీవి 2023 వ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.
అందులో బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వం లో వచ్చిన భోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఒకే సంవత్సరంలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరొక సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగలడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం… బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య లో చిరంజీవి చాలా మాస్ గా కనిపించారు. ప్రతి ప్రేక్షకుడికి కూడా చేరువయ్యే విధంగా కామెడీని పండిస్తూ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని కూడా అందుకున్నారు. 2023 వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిస్తే భోళా శంకర్ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయింది.
అయితే ఈ సినిమాని ఎందుకు చిరంజీవి చేశాడా అని మరి కొంతమంది చిరంజీవి అభిమానులు కూడా ఈ విషయంలో చాలావరకు నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. అయితే అజిత్ హీరోగా వచ్చిన వేదాలం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడంలో దర్శకుడు మెహర్ రమేష్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమం లో చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో దొరికితే ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని మెహర్ రమేష్ మీద కూడా చాలా దారుణమైన ట్రోలింగ్స్ అయితే వచ్చాయి.
ఇప్పటికే 5 సినిమాలు చేస్తే 5 సినిమాలు కూడా ప్లాపవ్వడంతో మెహర్ రమేష్ కి ఇండస్ట్రీలో సినిమా ఇచ్చే హీరోగాని, ప్రొడ్యూసర్ గానీ కరువ్వరనే చెప్పాలి. మరి మెహర్ రమేష్ ఎందుకు అలాంటి సినిమాలు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయన స్టైలిష్ గా సినిమా ఉండాలి అనుకుంటారు కానీ స్టోరీ లో దమ్ముందా లేదా అనేది మాత్రం చూసుకోరు అందుకే ఆయనకి భారీ ఫ్లాపులు వస్తున్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…