Photo Story: సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం లాంటిది. హవా ఉన్నంతకాలం మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఆ తరువాత ఎవరూ పట్టించుకోరు. గతంలో చాలా మంది హీరోయిన్లు వయసు పైబడి పోయే వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. కానీ నేటి కాలంలో హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత మాయమై పోతున్నారు. అయితే కొందరు ఈ ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్లుగా మారుతున్నారు. కానీ ఆ తరువాత గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. లేటెస్టుగా ఓ హీరోయిన్ గుండు చేయించుకుని మరీ అందరికీ షాక్ ఇచ్చింది. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా?
2001లో ‘రేపల్లెలో రాధ’అనే సినిమా గుర్తుందా? ఎవరికీ గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. కానీ ఆ తరువాత 2003లో ‘బాపుబొమ్మకు పెళ్లంట’ అనే సినిమా వచ్చింది కదా..ఇందులో రెండు జడలు వేసుకుని కుందనపు బొమ్మలా ఉన్న అమ్మాయే ఈమె. ఈమె పేరు గాయత్రి రఘురామ్. ‘బాపు బొమ్మ’ సినిమాతో ఫేమస్ అయిన గాయత్రి తెలుగులో నటించలేదు గానీ..కొన్ని తమిళ సినిమాల్లో నటించింది.
అయితే కొంతకాలం 2004 నుంచి 2010 వరకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో కనిపించింది. మరికొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో మెరిసింది. అయితే 2021లో నితిన్ మూవీ రంగ్ దే సినిమాలో హీరో సోదరిగా నటించింది. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది.
2006లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత గాయత్రి రఘురామ్ దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. 2010లో ఆయనకు గాయత్రి విడాకులు ఇచ్చింది. ఇదే ఏడాదిలో బీజేపీలో చేరిన ఆమె కొంతకాలం పార్టీలో కొనసాగారు. ఆ తరువాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. దీంతో మరోసారి ఆమెకు సినీ ఇండస్ట్రీపై ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలో అవకాశం వచ్చిన చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది.
గాయత్రి రఘురామ్ లైఫ్ లో అన్నీ అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలు తీయించుకుంది. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.