Jai Bheem: ప్రముఖ స్టార్ హీరో సూర్య నటించి, నిర్మించిన చిత్రం ” జై భీమ్ “. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేక్శకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో… 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో సూర్యతో పాటు మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఐఎండిబిలో ఈ చిత్రం అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. హాలీవుడ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి ఈ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి చిత్రం ‘జై భీమ్’ కావడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమాను మరో ప్రముఖ వ్యక్తి ప్రశంసించారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క జై భీమ్ ఛీత్రాన్ని వీక్షించారు. కాగా అనంతరం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది సీతక్క. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలిచి తీరుతుందని ఆశిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. అణగారిన వర్గాల కోసం జరిగిన ఈ న్యాయ పోరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది అని ఆమె అన్నారు. అయితే సీతక్క చేసిన ట్వీట్కు స్పందించిన హీరో సూర్య తమ చిత్ర బృందం తరఫున సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు ఈ సినిమాపై పలువురు విమర్శలు చేస్తున్నారు. సూర్యను కొట్టిన వారికి రివార్డు కూడా ఇస్తాం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీతక్క చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.