తమిళ చిత్ర రంగంలోఒక విప్లవం తెచ్చి తమిళ సినిమాలను జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శక మేధావి కె బాలచందర్ గారికి ప్రియతమ శిష్యుడైన దర్శక , రచయిత విసు నేటి మధ్యాహ్నం (మార్చ్ 22 ) తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధ పడుతున్న” విసు” చివరకు ఇవాళ్టితో విముక్తం చెందాడు. ఒక పక్షం రోజుల ముందు 1981 లో తన రచనలో రూపుదిద్దు కొన్న రజనీకాంత్ చిత్రం ” నెట్రిక్కాన్ ” ( తెలుగులో ముసలోడికి దసరా పండుగ ) సినిమాని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేస్తున్నాడని తెలిసి దానిపై తన అభ్యంతరం తెలిపే క్రమంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు
చేయడం జరిగింది. అదే విసు పబ్లిక్ తో చివరిసారి మాట్లాడిన మాటలు …
గురువు కె బాలచందర్ నిర్మించిన ‘కుటుంబం ఒరు కదంబం ‘ చిత్రం ద్వారా 1981 లో దర్శకుడిగా మారిన విసు ఆ తరవాత ఎన్నో హిట్ చిత్రాలు డైరెక్ట్ చేయడం జరిగింది. విసు దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ కావడమే గాక సూపర్ హిట్ అయ్యాయి కూడా ….వాటిలో సంసారం ఒక చదరంగం ,రామాయణం లో పిడకల వేట, పుణ్యస్త్రీ , శ్రీమతి ఒక బహుమతి , ఆడదే ఆధారం, మనిషికో చరిత్ర వంటివి నేటికీ ప్రేక్షకులకి గుర్తుండి పోయాయి స్త్రీ సమస్యల ఆధారం గా మరపురాని చిత్రాలను నిర్మించిన ” విసు ” దక్షిణ భారత చిత్ర సీమలో ఒక అరుదైన మేధావి అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు ..
A creator lives forever
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Tamil actor director visu passes away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com