kondapolam: ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కొండ పొలం. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో … మంచి కలెక్షన్లను సంపాదిస్తుంది. కొండపొలం నవల అధారంగా క్రిష్ ఈ సినిమా రూపొందించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అలరించింది.ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీయాలని భావించినట్లు సమాచారం.
తీరిక దొరికితే పుస్తకాల్లో మునిగిపోయే సుకుమార్.. కొండపొలం నవల నచ్చడంతో ఈ కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని అనుకున్నాడట. అప్పటికే పుష్ప మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం వల్ల కొండపొలం పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ‘పుష్ప’ మూవీ కూడా ఆటవి నేపథ్యంలో ఉండటంతో రెండు సినిమాలు ఒకే నేపథ్యంలో వస్తాయని భావించి కొండపొలం తీయాలన్న ఆలోచనను పక్కన పెట్టాడట సుకుమార్.
మరోవైపు, ఈ సినిమా తీయడానికి సుకుమార్, హరీశ్ శంకర్ కారణమని క్రిష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుకుమార్ ఓ సందర్భంగా కొండపొలం నవలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు క్రిష్ తెలిపారు. క్రియోటివ్గా ఆలోచిస్తూ కథతో ప్రయోగాలు చేసే సుక్కు కొండపొలం తీస్తే ఏలా ఉండేదో అని, థ్రిల్ ని మిస్ అయ్యామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక హీరోయన్గా కనిపించనుంది.