EMK: ఎవరు మీలో కోటీశ్వరులు: జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం సంగతి తెలిసిందే. తమ ప్రతిభ ద్వారా సామాన్యులని కోటేశ్వరుని చేయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. కౌన్ బనేగా కరోడ్పతి అనే పేరుతో హిందీలో ఈ షో మాత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తద్వారా షో నిర్వాహకులు దీన్ని తదితర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అలా తెలుగులో ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు గా రూపుదిద్దుకున్నది.

అయితే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీస్ విచ్చేసారు. షో కర్టెన్ రైజర్ లో రామ్ చరణ్ హాజరు అయ్యి కార్యక్రమాన్నిపెద్ద హిట్ అయ్యే మార్గం దిశగా నడిపించారు. ఈ నేపథ్యం లో ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతి వారం వారం ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. అలా మూడో వారానికి గాను రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు హాజరై ఎన్టీఆర్ తో పాటు ప్రేక్షకులను అలరించారు.
సెలబ్రిటీ గెస్ట్ ప్లాన్: ఎవరు మీలో కోటీశ్వరులుగా జెమినీ టీవిలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభం కాకముందు జెమినీ టీవీ రేటింగ్స్ చాలా దారుణం గా ఉండేవి. ఈ షో ప్రాంభమయ్యాక మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో పాటు దూసుకుపోతుంది. ప్రారంభమే సెలబ్రిటీ గెస్ట్ రాంచరణ్ తో మొదలవ్వగా అవ్వగా, దానికి గాను మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆలా ఈ కార్యక్రమంలో లో సెలెబ్రిటీలు పాల్గునేటట్లు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు అనే ప్రచారం జరుగుతుండగా షూటింగ్ కూడా పూర్తయిందని మహేష్ బాబు ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ దీపావళికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక సెలబ్రిటీ ఎపిసోడ్స్ లో ఉన్న రూల్స్ ప్రకారం సెలబ్రిటీలు ఎంత గెలిచిన అవన్నీ చారిటీకి ఇచ్చే చేయాల్సి ఉంటుంది.
ఇక తాజా గా రిలీజ్ అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సమంతని క్విట్ అయిపోతారా అని అడగ్గా…. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ ఎన్టీఆర్ పైన గుర్రున అరుస్తున్న సమంత ప్రోమో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఏం జరగబోతుందో చూడాలంటే మరి ఈ గురువారం వరకు ఎదురు చూడాల్సిందే.