Homeఎంటర్టైన్మెంట్Sridevi: ఆ హీరో ఆరోగ్యం కోసం శ్రీదేవి ఉపవాసం..ప్రత్యేక పూజలు..ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

Sridevi: ఆ హీరో ఆరోగ్యం కోసం శ్రీదేవి ఉపవాసం..ప్రత్యేక పూజలు..ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

Sridevi: లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఈమధ్య అందరి హీరోయిన్స్ కి వాడేస్తున్నారు. ఒకటి రెండు సూపర్ హిట్స్ రాగానే అలా పిలవడం చాలా కామన్ అయిపోయింది. కానీ ఆ ట్యాగ్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఎవర్ గ్రీన్ హీరోయిన్ కేవలం శ్రీదేవి మాత్రమే. బాలనటిగా మొదలుపెట్టిన ఆమె సినీ కెరీర్, ఆ తర్వాత హీరోయిన్ గా మారి అప్పటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించింది. కేవలం తెలుగుకి మాత్రమే ఈమె పరిమితం కాలేదు. తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో కూడా నటించింది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈమెని నెత్తిన పెట్టుకొని చూసారు. అలా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ స్టార్ అనిపించుకున్న శ్రీదేవి, అసలు సిసలైన లేడీ సూపర్ స్టార్ అని పిలవొచ్చు. అయితే శ్రీదేవి అత్యధికంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమాలు చేసింది.

అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో 20 కి పైగా సినిమాలు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, వీళ్లది ఎలాంటి సూపర్ హిట్ జంట అనేది. ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటిస్తేనే రకరకాల సంబంధాలను మీడియా అంటగడుతుంది. అలాంటిది 20 సినిమా కలిసి చేస్తే ఎందుకు మౌనంగా ఉంటుంది..?, అప్పట్లో వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ శ్రీదేవి రజినీకాంత్ కి అత్యంత ఆప్తురాలు. సొంత కుటుంబ సభ్యులు లాగా ఉండేవాళ్ళు వీరంతా. శ్రీదేవి వాళ్ళ అమ్మ కూడా రజినీకాంత్ కి చాలా క్లోజ్. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమెతో రజినీకాంత్ సరదాగా మాట్లాడేవాడట. ఒకరోజు శ్రీదేవి అమ్మతో రజినీకాంత్ మాట్లాడుతూ ‘కమల్ హాసన్ స్థాయికి నేను ఎప్పుడు ఎదుగుతాను. ఆయన లాగా అత్యధిక రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకుంటానో అమ్మ..అసలు అది సాద్యపడుతుందా’ అని అడిగాడట. అప్పుడు ఆమె ‘కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అవుతావు నాన్న, బాధపడొద్దు, కస్టపడి పనిచెయ్యి’ అని అనిందట. ఆరోజు ఆమె ఇచ్చిన దీవెనెలు రజినీకాంత్ కి బాగా కలిసొచ్చింది. కేవలం తమిళనాడు కి మాత్రమే కాదు, ఇండియా కే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారిపోయాడు రజినీకాంత్.

ఇదంతా పక్కన పెడితే 2011 వ సంవత్సరం లో రజినీకాంత్ ‘రానా’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఆరోగ్యం చాలా తీవ్రంగా అస్వస్థతకి గురైందట. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీదేవి చాలా కంగారు పడిపోయిందట. ఆయనకీ ఏమి కాకూడదని అప్పట్లో వారం రోజులపాటు ఉపవాసం ఉన్నిందట. అలాగే తన ఇష్టదైవం పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించిందట. దీనిని బట్టి ఆమెకి రజినీకాంత్ అంటే ఎంత అభిమానమో, అతనితో ఎంతటి సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి చనిపోయిన సమయంలో రజినీకాంత్ చాలా మానసిక వేదనకు గురయ్యాడట. తేరుకోవడానికి చాలా నెలలు పట్టిందని కోలీవుడ్ వర్గాలు చెప్పేవి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular