Homeఎంటర్టైన్మెంట్Sonali Bendre: చిరంజీవి ని చూసి భయపడి రాత్రంతా నిద్రపోలేదు అంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్...

Sonali Bendre: చిరంజీవి ని చూసి భయపడి రాత్రంతా నిద్రపోలేదు అంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Sonali Bendre: కేవలం మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూడడం కోసం లక్షలాది మంది అభిమానులు థియేటర్స్ కి క్యూ కడుతుంటారు. 7 పదుల వయస్సులో కూడా ఆయన నేటి తరం యంగ్ హీరోలతో సరిసమానంగా డ్యాన్స్ వేస్తుండడం గమనార్హం. డాన్స్,నటన, ఫైట్స్ ఇలా ఏది చెయ్యాలన్నా చిరంజీవి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది. అలాంటి చిరంజీవి పక్కన డ్యాన్స్ వెయ్యడం అంటే చిన్న విషయం కాదు. అప్పట్లో రాధ, భానుప్రియ, రంభ వంటి వారు మాత్రమే చిరంజీవి డ్యాన్స్ లో పోటీని ఇచ్చేవారు. మిగిలిన హీరోయిన్లు చిరంజీవితో డ్యాన్స్ అంటే భయపడేవారు. వారిలో సోనాలి బ్రిందే కూడా ఒకరు. సోనాలి మెగాస్టార్ తో కలిసి ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Also Read: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ లో భాగంగా రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఇంద్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనాలి బ్రిందే ఇంద్ర చిత్రంలో చిరంజీవి తో కలిసి పని చేసిన అనుభూతిని గుర్తు చేసుకుంటూ ఒక వీడియో విడుదల చేసింది. ఆమె మాట్లాడుతూ ‘వైజయంతి మూవీస్ బ్యానర్ లో పని చేయడం చాలా గొప్ప అనుభూతి, అశ్వినీదత్ గారు నన్ను షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎంతో బాగా చూసుకున్నారు. చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం. షూటింగ్ మొత్తం నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను కానీ, చిరంజీవి గారితో డ్యాన్స్ వేయాల్సిన రోజు వచ్చినప్పుడు మాత్రం చాలా భయపడేదానిని. ఆయనతో సమానంగా డ్యాన్స్ చెయ్యడం పెద్ద సాహసం. రేపు ఉదయం సాంగ్ షూటింగ్ ఉంది, చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ వెయ్యాలి, ఎలా చేస్తానో ఏంటో అని భయంతో ఆరోజు రాత్రి మొత్తం నిద్రకూడా పోలేదు. ముఖ్యంగా ఆయనతో కలిసి వీణ స్టెప్ ని కొరియోగ్రాఫర్ వెయ్యమంటాడేమో అని భయపడ్డాను, కానీ నాకు వేరే స్టెప్ ని ఇచ్చి బ్రతికించారు. నా కెరీర్ ని మలుపు తిప్పిన ఈ చిత్రం రేపు మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుందని తెలిసి ఎంతో సంతోషించాను. ఈ చిత్రాన్ని నేను కూడా థియేటర్స్ లో చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బ్రిందే.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ చిత్రం రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ఓవర్సీస్ లో షో పడకముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆల్ టైం రికార్డు గ్రాస్ సాధించిన చిత్రంగా అవ్వబోతుందట ఇంద్ర. ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాలలో మురారి నెంబర్ 1 గ్రాసర్ గా నిల్చింది. సుమారుగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాని ఇంద్ర దాటుతుందో లేదో చూడాలి.

Also Read:  సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular