Actress Shriya: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ తనదైన నటనతో తెలుగునాట మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను సీక్రెట్గా పెళ్లాడింది శ్రియ. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వారిద్దరికి ఏడాది పాప ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ పాపకు రాధ అనే పేరు పెట్టినట్లు ఇటీవల ప్రకటించింది. కాగా తన భర్త ఆండ్రూ తో కలిసి విహారయాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో… శ్రియ పోస్టులు చేయడం అందరికీ తెలిసిందే.
అయితే త్వరలో ప్రసారం కాబోతున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో ఈ దంపతులిద్దరూ పాల్గొన్నారు. ఇప్పటి వరకు శ్రియ తన భర్తను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడూ తీసుకురాలేదు. ఈ నేపధ్యంలో మొదటిసారి శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి స్టేజ్ మీదకి రావడంతో అందరూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలో శ్రియ భర్త ఆండ్రూ కలిసి అక్కడున్న వారందరికి షాక్ ఇచ్చారు.
ఇంగ్లీష్ తప్ప మరే భాష తెలియని ఆండ్రూ తెలుగులో నమస్కారం అంటూ పలికరించడం అందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని యాంకర్ ప్రదీప్ అనడంతో… వారిద్దరు కలిసి స్టిల్స్ పెట్టారు. ఈ క్రమంలోనే శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టారు. ఆ తర్వాత శ్రియ కూడా తన భర్తకు లిప్ కిస్ పెట్టి అంధర్ణి ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్కడకి వచ్చిన బుల్లితెర తారలు కూడా అవాక్కయ్యారు. ఇలా లిప్ లాక్ లు కౌగిలింతలతో స్టేజీని హీటెక్కించారు. కానీ ఈ జంట చేసిన పనిని కొందరు తప్పు బడుతున్నారు.