Homeఎంటర్టైన్మెంట్Raghavendrarao: పౌరాణిక చిత్రం తెరకెక్కించాలననే ఉద్దేశంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు...

Raghavendrarao: పౌరాణిక చిత్రం తెరకెక్కించాలననే ఉద్దేశంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు…

Raghavendrarao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు 100 పైగా చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో  90% చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయని చెప్పవచ్చు.  పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో టాలీవుడ్ లో దర్శకేంద్రుడుకి ఎవరు సాటి రారని చెప్పాలి.  అన్నమయ్య, శ్రీరామదాసు వంటి  అద్భుతమైన కావ్యాలను తెరకెక్కించి ప్రేక్షక అభిమానులకు థియేటర్ లో దైవత్వాన్ని చూపించారు ఈ దర్శకుడు. ఈ దర్శకేంద్రుడు 2017 లో చివరిగా డైరెక్ట్ చేసిన ‘ఓం నమో వెంకటేశాయ’సినిమా తర్వాత ఏ మూవీని తెరకెక్కించ లేదు. ప్రస్తుతం ఆయన ఇటీవలే విడుదలైన “పెళ్లి సందD ” చిత్రంలో ఒక పాత్రలో నటించి మెప్పించారు.

senior director raghavendrarao planning to make movie on ramayanam

అలానే  తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాఘవేంద్రరావు మళ్ళీ డైరెక్షన్ వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీ రాముడి చరిత్రను ఎంతో మంది దర్శకులు తెరకెక్కించారు. అయితే రాఘవేంద్ర రావు గారు కూడా రామాయణం చిత్రాన్ని తెరకెక్కించాలని ఉద్దేశంలో ఉన్నారట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పటి తరానికి “శ్రీరామ సీతమ్మవారి “గాధను తెలిసేలా ఈ కావ్యాన్ని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారు అని సినీ వర్గాల్లో చర్చించుకునటున్నారు.

భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని… నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్”  చిత్రం రామాయణం కథ మీదగా తెరకెక్కుతుంది.  ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా… సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular