Samantha: సినిమా ప్రియులకు ఆస్కార్ అవార్డులు అనేది ఒక పండగ లాంటిది అనే చెప్పాలి. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే ఆస్కార్ అవార్డుకి ఎంపిక కావడం జరుగుతూ ఉంటుంది. కానీ 2022 ఆస్కార్ బరిలోకి తమిళ సినిమా ” కూళంగల్ ” ఎంపికై… పలువురి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. వినోద్ రాజ్ పి.యస్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం కూళంగల్ ఈ సినిమాని దర్శకుడు విఘ్నేశ్ శివన్, నయనతార నిర్మించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ సమంత… విగ్నెష్ శివన్ కి అభినందనలు తెలిపారు.
‘మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. ‘కూజంగళ్’ సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ’ అంటూ సామ్ తన సంతోషాన్ని తెలిపారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కుడా ‘కూళంగల్’ సినిమా ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైనందుకు విఘ్నేశ్ శివన్, నయన్ కి అభినందనలు తెలిపారు. అదే విధంగా తదితర సెలబ్రిటీస్ కూడా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. “కూళంగల్” చిత్రం రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోగా… తమిళ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఆస్కార్ ఎంట్రీకి 14 భారతదేశ చిత్రాలు ఎంపికవ్వగా వాటిలో సర్దార్ ఉద్దమ్,షేర్ని,షేర్షా,తూఫాన్ హిందీ నుండి ఎంపిక అయ్యాయి. మలయాళం నుంచి ‘నాయాట్టు’ సినిమా ఎంపిక కాగా… తమిళ ఇండస్ట్రి నుంచి ‘మండేలా , కూజంగళ్’ ఆస్కార్ కు స్థానాన్ని సంపాదించాయి. మరాఠీ మూవీ ‘గోదావరి’ ఆస్కార్ కి నామినేట్ కావడం విశేషం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Samantha congratulates vignesh shivan for his producing movie nominated for oscar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com