హీరోయిన్ రాశికన్నా కేవలం గ్లామర్ తోనే సినిమాల్లో నెట్టొకొస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కుర్రహీరోలందరికీ సరసన నటించింది. ఇటీవల భామకు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ ఇండస్ట్రీకి చక్కేసిందనే వార్తలు విన్పించాయి. తాజాగా ఈ అమ్మడు మెగా హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసి వార్తల్లో నిలిచింది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజు తాజాగా నటించే చిత్రం రాశికన్నా ఎంపికైనట్లు తెలుస్తోంది.
తేజు-రాశికన్నా కాంబినేషన్లో ఈ చిత్రం మూడోది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘సుప్రీమ్’ మూవీ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ‘ప్రతి రోజు పండుగే’ మూవీలో తేజుకు జోడిగా నటించింది. ఈ మూవీకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. దీంతో వీరిద్దరిది హిట్ పేర్ గా నిలిచిపోయింది.
తాజాగా సాయిధరమ్ తేజ్ దేవ కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని ఇటీవల పవర్ స్టార్ పవన్ తేజుపై క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నివేదా పేతురేజ్ ఎంపికైంది. మరో హీరోయిన్ గా తేజుకి అచ్చొచ్చిన రాశీఖన్నాని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Sai tej to romance raashi khanna for the third time again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com