Homeఎంటర్టైన్మెంట్తేజ్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో ఇప్పుడు తెలిసింది

తేజ్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో ఇప్పుడు తెలిసింది

Sai Dharam Tej Political Thriller
మెగా హీరో సాయి తేజ్ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాను కంప్లీట్ చేసిన ఆయన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దేవ కట్ట డైరెక్ట్ చేయనున్నారు. తేజ్ ఇప్పటివరకు అన్నీ లవ్ సబ్జెక్ట్స్, మాస్ ఎంటెర్టైనర్లు మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ దేవ కట్టతో చేయబోయే సినిమా మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇది పోలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనుంది.

Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..!

దేవ కట్ట గత సినిమాల్లో ‘ప్రస్థానం’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది కూడ డార్క్ పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయాలను, వ్యక్తుల భావోద్వాగాలను కలబోసి రాసిన కథ అది. అందుకే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరవాత మంచి పేరు తెచ్చుకుంది. బుల్లి తెర మీద ఇతర మాధ్యమాల్లో చూసేసరికి ఆ సినిమాలోని డెప్త్ ప్రేక్షకులను అర్థమైంది. హీరోలు కూడ అలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలని దేవ కట్టను అప్రోచ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Also Read: షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..!

కానీ ఎవరితోనూ అలాంటి సినిమా చేయని దేవ కట్ట ఇప్పుడు తేజ్ సినిమా కోసం అలాంటి కథే రాశారట. ఈ సినిమాలో రాజకీయాలు, సొసైటీ అనే అంశాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఈ చిత్రం మీద తేజ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. కథ ఖచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని ఆయన భావిస్తున్నారట. మరి ఈసారి దేవ కట్ట పెన్ పవర్ ‘ప్రస్థానం’ స్థాయిలో ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular