మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో జరుగుతోందని సమాచారం. పోలీస్ అధికారిగా నటిస్తున్న రవితేజతో పాటు పలువురు ఆర్టిస్టులు పాల్గొనగా… జైల్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఏప్రిల్ 2 వరకు ఈ షెడ్యూల్ సాగుతుందని… దీంతో టాకీ పూర్తవుతుందని సమాచారం. అనంతరం ఏప్రిల్ 4 నుండి జర్మనీ లో పాటల చిత్రీకరణ ప్లాన్ చేశారని.. అవయ్యాక హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో చివరి గీతాన్ని షూట్ చేస్తారని టాక్. థమన్ సంగీతమందిస్తున్న `క్రాక్` మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.