సినీ ఇండస్ట్రీ లో విజయాలకు దగ్గరి దార్లు వెతకడం బాగా అలవాటు చేసుకొంటున్నారు. మునుపటిలా సొంత కధలు తయారు చేసుకోవడం బాగా తగ్గింది. రీమేక్ సినిమా లే దిక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇపుడు తాజాగా ఒక మళయాళ సినిమా మీద మన తెలుగు నిర్మాతల దృష్టి పడింది. మలయాళం లో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’.ని తెలుగు సినిమా నిర్మాతల కంట్లో పడింది .కాగా ఇది ఇద్దరు హీరోలు చేయాల్సిన సినిమా. ఒక హీరోగా రానా దగ్గుబాటి నటించడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.ఇక రెండో హీరోగా వెంకటేష్ , బాలకృష్ణల పేర్లు వినిపించాయి. వారిలో బాలయ్య పేరు దాదాపు ఖరారు అయ్యిందని అంతా అనుకొన్నారు. కానీ ఇపుడు సడన్ గా రవి తేజ పేరు తెర మీదకు వచ్చింది .
ఈ మధ్య రవితేజ వరుస సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా తెర కెక్కు తోంది . ఇక ఈ సినిమా కాకుండా మరో మూడు సినిమాలను కూడా రవితేజ చేయబోతున్నాడు. కాగా ఇప్పుడు ఓ మలయాళ రీమేక్లో రవితేజను నటింప చేయాలని నిర్మాతలు అను కుంటున్నారు . మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’.అనే మల్టీ స్టారర్ చిత్రం ఇపుడు తెలుగులో అనువదించ బడుతోంది .
ముందు ఈ సినిమాలో రానా తో పాటు , నందమూరి బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినపడింది. కానీ హఠాత్తుగా నిర్మాతలు రవితేజను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని ఫ్లాష్ న్యూస్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ కంబైన్డ్ గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కరోనా ప్రభావం తగ్గగానే ప్రారంభమయ్యే ఈ సినిమాకు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించే ఛాన్స్ వుంది . సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశాలున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More