Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఉత్తరాదితోపాటు తెలుగులోనూ ఈ హీరోకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పలు చిత్రాలతో అలరించిన ఈ కుర్ర హీరో.. ప్రస్తుతం పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే అన్ని భాషల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యేదంకు ప్రయత్నిస్తున్నాడు.
కాగా, ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ నేపథ్యం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తన సొంత కాళ్ల మీద నిలబడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రణబీర్. కెరీర్ మొదట్లో స్టార్ దర్శకుడు సంజయ్లీలా బన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి.. దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకున్నారు.
Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !
కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణబీర్.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బన్సాలీ వద్ద తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
రాజ్ కపూర్:ద మాస్టర్ ఎట్ వర్క్ అనే బుక్ని లాంచ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రణబీర్ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే నేటి దర్శకులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరం డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలకు మొగ్గుచూపుతున్నారని ఎవరైనా అంటే నేను నమ్మనని అన్నారు. ఎంతో నిబ్దతతో వారు పని నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో తాను బన్సాలీ వద్ద బ్లాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో గంటల తరబడి మోకాళ్ల మీద కూర్చొనేవాడినని.. బన్సాలీకి కోపం వస్తే ఏడాపెడా తిట్టేవారని.. ఒక్కోసారి కొట్టేవారని చెప్పారు. అలా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. అలాంటివన్నీ భవష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చారు రణబీర్.
Also Read: వివాదాస్పద హీరోయిన్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More