యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా ప్రచారంలోకి వచ్చిన ఈ చిత్రం.. షూటింగ్ కు ఆ మధ్యనే గుమ్మడి కొట్టేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్కులో బిజీగా ఉంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ఆసక్తిని కలిగించే విషయం ఒకటి బయటకు వచ్చింది.
ప్రభాస్ – పూజా హెగ్డే నడుమ స్వచ్ఛమైన ప్రేమ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే. కానీ.. అది ఎలా ఉంటుంది? ఏ కోణంలో సాగుతుంది? అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. నిజానికి సినిమా మోషన్ పోస్టర్ లో చాలా కథను రివీల్ చేశారట. అయితే.. సినిమా చూసిన తర్వాతే దాన్ని గుర్తించగలరని అంటున్నారు.
అయితే.. ఇప్పుడు లీకైన సమాచారం ప్రకారం రాధేశ్యామ్ లో గీతాంజలి సినిమా యాంగిల్ కాస్త ఉంటుందని సమాచారం. అంటే.. నాగార్జున గీతాంజలి సినిమాలో అనారోగ్యంతో బాధపడ్డట్టుగా.. ఈ సినిమాలోనూ అలాంటి కోణం ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు.. హీరో హీరోయిన్లలో ఒకరు చనిపోవచ్చని కూడా అంటున్నారు. లేదంటే.. ఇద్దరూ ఈ గండాన్ని దాటేయొచ్చని కూడా చెబుతున్నారు.
క్యారెక్టర్ల మరణం సంగతి అటుంచితే.. లవ్ యాంగిల్ మాత్రం గీతాంజలి కోణంలోనే ఉంటుందని బలంగా ప్రచారం సాగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను ఫినిష్ చేసి, జులై 30న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.