‘అర్జున్ రెడ్డి’తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని కబీర్సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టి మొత్తానికి బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తన మొదటి సినిమా ఎఫెక్ట్ అనుకుంటా.. సందీప్ రెడ్డి వంగాకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది. కాగా ప్రస్తుతం సందీప్ ‘యానిమల్’ పేరుతో రణబీర్ కపూర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రాని తీసుకున్నాడు. పైగా ఇది కూడా బోల్డ్ సినిమానే అని తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే పరిణితి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి.
కానీ ఆమె నటించిన “ది గర్ల్ ఆన్ ది ట్రైన్”, “సైనా”, “సందీప్ ఔర్ పింకీ ఫరార్’ మూడు సినిమాలు పరాజయం పాలు అయ్యాయి. పైగా క్రిటిక్స్ నుంచి కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే ఆమె నటన పై కూడా బ్యాడ్ కామెంట్స్ వినిపించాయి. అందుకే, ఆమెని ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా పెట్టొద్దు అంటూ దయచేసి మంచి క్రేజున్న మరో హీరోయిన్ ని తీసుకోండి అంటూ సందీప్ కి మెసెజ్ లు పెడుతున్నారు బాలీవుడ్ జనం. రణబీర్ ఫ్యాన్స్ నుండి కూడా పర్సనల్ గా రణబీర్ కి సేమ్ రిక్వెస్ట్ లు వస్తుండడం విశేషం. మరి అభిమానుల కోరికను ఈ దర్శకహీరోలు ఇద్దరూ ఎంతవరకూ పట్టించుకుంటారో చూడాలి.
అయితే భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా షూట్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా రావడం, సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోవడం, దాంతో తలపట్టుకున్న సందీప్ వంగ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూన్ నుండి స్టార్ట్ చేయాలని ఇప్పటికైతే సందీప్ ప్లాన్ చేసుకున్నాడు. అన్నట్టు ఈ సినిమా కూడా హిట్ అయితే, ఇక సందీప్ రేంజ్ మాములుగా ఉండదు. బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ నుండి హిట్ సినిమా రావాలని ఆశిద్దాం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Please remove parineeti chopra from animal movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com