PellisanaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం పెళ్లిసందD. అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకుంది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తమ సినిమా మంచి విజయం సాధించాలని ముందుగా తిరుమల వెంకన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రముఖ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రోషన్ ఈ సినిమా రూపొందింది.
కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందని హీరోయిన్ శ్రీలేఖ అన్నారు. కుటుంబ సభ్యులందరు చూడదగిన సినిమా పెళ్లిసందడి అని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి థియేటర్లలో మాత్రమే ఈ సినిమా చూడాలని ఆమె అన్నారు.
నిర్మల కాన్వెంట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల పరిచయం అయిన రోషన్.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. రుద్రమదేవి చిత్రంలో కూడా రోషన్ నటించారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లిసందడి చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించగా… ఈ సినిమాకు కూడా పర్యవేక్షణ చేస్తుండటం విశేషం.
గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే అందం, అభినయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు తెలుగునాట అభిమానులు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే థియేటర్లలో సినిమా ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.