Peddi Ticket Price Hike: గత కొంతకాలం గా టాలీవుడ్ లో జరుగుతున్న వివాదాన్ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్సిభిటర్స్ మాకు కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని , అది ‘పెద్ది’ నుండే మొదలు అవ్వాలని పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదు. ‘పెద్ది’ విషయం లో ఇప్పటి వరకు విధానం ఆలోచించే అవకాశం రాలేదని , చర్చల ద్వారా , కొన్ని కండీషన్స్ ని వాళ్ళు ఒప్పుకుంటూనే మేము కమీషన్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని రన్ చేయడానికి ఒప్పుకుంటామని నిర్మాతలు తేల్చి చెప్పారు. దీనిపై కొన్ని రోజులు వివాదం నడుస్తూనే ఉన్నింది. అయితే రీసెంట్ గానే ఎక్సిభిటర్లు మెగాస్టార్ చిరంజీవి ని కలవడం , అదే విధంగా నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవడం తో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది.
‘పెద్ది’ చిత్రాన్ని రెంటల్ బేసిస్ మీద నడిపేందుకు ఎక్సిభిటర్లు ఒప్పుకున్నారు. కానీ ఒకవేళ తెలంగాణ లో టికెట్ రేట్స్ హైక్స్ కి ప్రభుత్వం అనుమతిస్తే , అందులో నుండి వచ్చే కలెక్షన్స్ లో 7.5 వాటా మాకు ఇవ్వాలని ఎక్సిభిటర్లు షరత్తు పెట్టడం , అందుకు నిర్మాతలు కూడా ఒప్పుకోవడం తో , వివాదం ఇక్కడితో ముగిసింది. దీంతో జూన్ 4 న తెలంగాణ లో ఒకవేళ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే , ఈ చిత్రం కమీషన్ బేసిస్ మీదనే రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే రెంటల్ బేసిస్ మీదనే రన్ అవుతాయి. దిల్ రాజు బృందం కూడా 7.5 శాతం కమీషన్ కి ఒప్పుకోవడం , ఎలాగో దిల్ రాజు ప్రభుత్వం లో ఉన్నాడు కాబట్టి , టికెట్ హైక్స్ కి ఎలాంటి అడ్డంకి పెట్టే అవకాశం లేకపోవడం తో , కచ్చితంగా ఈ చిత్రానికి టికెట్ హైక్స్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
దీంతో ప్రస్తుతానికి ‘పెద్ది’ ముందు ఉన్నటువంటి చిక్కుముడులు తెరపడినట్టే అయ్యింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా ట్విస్టులు రాబోతున్నాయా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 600 రూపాయిల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రీమియర్ షోస్ తో పాటుగా, రోజుకి 5 షోస్ ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వనుంది కూటమి సర్కార్. ఇక మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి చూడాలి.
