Peddi 15th Day Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బలమైన థియేట్రికల్ రన్ లో రీసెంట్ గానే 300 కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రానికి 400 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు కానీ, ఆ రేంజ్ వసూళ్లు అసలు రాలేదని , వాస్తవానికి ఇప్పటి వరకు 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా డ్రీం రన్ ఈ వీకెండ్ తో ముగిసిపోయేట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే 11 రోజుల తర్వాత వసూళ్లు బాగా డౌన్ అయిపోయాయి.
14 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 15 వ రోజున 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది , ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. దీంతో ‘పెద్ది’ థియేటర్స్ కూడా బాగా తగ్గాయి. ఆ కారణం చేత నేడు కనీసం 50 లక్షల షేర్ వసూళ్లు అయినా వస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో ‘పెద్ది’ చిత్రానికి పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో , ఆ రేంజ్ థియేట్రికల్ రన్ వచ్చిందని , ఇప్పుడు పోటీ ఉండడం తో బాగా డౌన్ అయ్యిందని అంటున్నారు.
కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయి అనే విషయాన్ని గ్రహించిన నిర్మాతలు , నిన్నటి నుండి థియేటర్స్ లో కొత్త సన్నివేశాలు జత చేసిన సరికొత్త వెర్షన్ ని థియేటర్స్ లో రీ లోడ్ చేశారు. ఈ కొత్త సన్నివేశాల కారణంగా కచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయని అనుకున్నారు. కానీ నిర్మాతల అంచనాలు తప్పాయి , ముందు రోజు తో పోలిస్తే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ , ఎలాంటి పెరుగుదల లేదు. కనీసం వీకెండ్ లో అయినా ఈ సరికొత్త సన్నివేశాల ప్రభావం కలెక్షన్స్ పైన కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక పోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 144 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 220 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగ, వరల్డ్ వైడ్ గా 196 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 331 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
