Homeఎంటర్టైన్మెంట్వాళ్ల సాయంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్?

వాళ్ల సాయంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్?

Breaking: Pawan Kalyan New Movie Announcement!జనసేన అధినేత, పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో ముగ్గురు జన సైనికులు విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో జరిగింది. ఆ కుటుంబాలకు పవన్‌ సంతాపంతోపాటు సానుభూతిని వ్యక్తం చేశాడు. అలాగే ప్రమాదంలో గాయపడిన జన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కాగా ఆ కుటుంబాలకు సినీ ప్రముఖులు, ఎన్నారైలు కూడా అండగా నిలిచారు. తాజాగా పవన్‌ వారి సహాయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

Also Read : డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..? వెల్లడించిన రియా?

కడపల్లి వద్ద జరిగిన దుర్ఘటనలో మరణించిన, గాయపడిన జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయలసీమ ప్రాంత సంయుక్త సమన్వయ కమిటీ సభ్యుడు చింతా సురేష్, తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్, కుప్పం ఇన్‌చార్జి డాక్టర్ ఎమ్.వెంకటరమణ, గంగాధర నెల్లూరు ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్ వెళ్లారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశాడు.

ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన అల్లు అర్జు‌న్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు అందించారు. అలాగే జనసేన ఎన్నారై మద్దతుదారులు రూ.5.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలాగే.. నిర్మాత దిల్ రాజుకు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు. మరో నిర్మాత ఏఎం రత్నంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 6 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చి గొప్ప హృదయాన్ని చాటుకొన్నారు. ఇలాంటి విషాద సమయంలో మీరు చూపించిన మానవత్వం గురించి మాటల్లో చెప్పలేం అంటూ పవన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే.. ఆ ఫ్యామిలీలకు మైత్రీ మూవీస్‌ కూడా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. మైత్రీ మూవీస్‌ అధినేతలు రవి, నవీన్‌కు కూడా పవన్‌ ధన్యవాదాలు చెప్పారు. మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చూపిన బాధిత కుటుంబాలకు అందించిన సహకారం గొప్పది అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

Also Read :

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular