spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Fans: ఢిల్లీ నాయకులను భయపెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. దద్దరిల్లిపోయింది సభ.. వీడియో...

Pawan Kalyan Fans: ఢిల్లీ నాయకులను భయపెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. దద్దరిల్లిపోయింది సభ.. వీడియో వైరల్..

Pawan Kalyan Fans: ‘ఓజీ’ మూవీ ఆరంభం లో ‘హడలెను ఊరు..విని తనపేరు.. ఓజాస్.. గంభీర’ అనే బ్యాక్ గ్రౌండ్ వోకల్స్ తో ఒక మ్యూజిక్ వస్తుంది గుర్తుందా?, సోషల్ మీడియా లో కూడా ఆ షాట్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని ఓజాస్ గంభీర పాత్ర ఎంత పవర్ ఫుల్ అని చెప్పడానికి ఉపయోగించినట్టు గా అనిపించడం లేదు, హీరో పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో చెప్పే డైలాగ్ గా అనిపించింది. ఏ సభ లో అయినా సరే , ఆయన పేరు వినిపిస్తే చాలు , ‘బాహుబలి 2’ చిత్రం లోని ఇంటర్వెల్ సన్నివేశం రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పట్లో అడవి శేష్ పవన్ కళ్యాణ్ పేరుని ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎత్తగానే సభా ప్రాంగణం మొత్తం ఏ స్థాయిలో దద్దరిల్లిపోయిందో మన కళ్లారా చూశాం.

జనాల నుండి వచ్చిన ఆ రెస్పాన్స్ ని చూసి రాజమౌళి సైతం సైతం పట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. రీసెంట్ గానే ‘పెద్ది’ మూవీ విజయోత్సవ సభ లో నిర్మాత పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము . ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విచ్చేసిన చిరంజీవి సైతం షాక్ కి గురయ్యే పరిస్థితి ఏర్పడింది , డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే చెవులు మూసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే నేడు కూడా రిపీట్ అయ్యింది. నేడు ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతం లోని రైల్వే కోడూరు లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘VB-G RAM-G’ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచ్చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. శివరాజ్ చౌహాన్ తో పాటు , ఢిల్లీ నుండి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ సభ కి విచ్చేసారు. అందులో ఒక నాయకుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాడు అంతే, సభా ప్రాంగణం మొత్తం జనాల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఒక 40 సెకండ్ల పాటు ఆయన్ని మాట్లాడనివ్వలేదు. దీంతో ఆ ఢిల్లీ నాయకుడు ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి , ఇలాంటివి అన్నీ ఇక్కడ మామూలే , మీ ప్రసంగాన్ని కొనసాగించండి అని చెప్పిన విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ ‘VB-G RAM-G’ స్కీం విషయానికి వస్తే , ఈ పధకం ద్వారా దేశం లోని పేద ప్రజలకు 125 రోజుల పాటు పని కల్పించనున్నారు, నేటి నుండి ఈ పధకం అమలులోకి రానుంది. ఈ పధకానికి అర్హులైన కూలీలకు రోజుకి 312 రూపాయిల వేతనాన్ని ఖరారు చేశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper