Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. 'ఉప్పెన' డైరెక్టర్ కు తీవ్ర అవమానం !

ప్చ్.. ‘ఉప్పెన’ డైరెక్టర్ కు తీవ్ర అవమానం !

Buchi Babu‘ఉప్పెన’ సినిమాలోని డైలాగ్స్ పై వచ్చిన అన్నీ మీమ్స్ ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమా పై రాలేదు. మరి అంతగా ప్యారడీకి స్కోప్ ఉన్న మాటలు రాసిన బుచ్చిబాబుకు కథ పై మంచి పట్టు ఉందని సుకుమార్ ఫుల్ డప్పు కొట్టాడు. కానీ ఇప్పుడు ఆ కథలోని లొసుగుల కారణంగానే బుచ్చిబాబుకి అవమానం జరిగింది. ఉప్పెన సక్సెస్ తర్వాత డైరక్టర్ గా బుచ్చిబాబుకు ఫుల్ డిమాండ్ వచ్చింది.

ఓ దశలో ఎన్టీఆర్ తో సినిమా ఫైనల్ అంటూ బుచ్చిబాబు పేరు మారుమోగిపోయింది. కానీ ఆ వార్త ఉత్తిదే అని తేలిపోయింది అనుకోండి. ఏది ఏమైనా తన రెండో సినిమాను కూడా మళ్లీ మైత్రీకే చేయాల్సి వుంది బుచ్చి బాబు. ఇది మైత్రీ రాయించుకున్న అగ్రిమెంట్. అందుకే బుచ్చిబాబు త్వరగా మైత్రీకి సినిమా చేసి, బయట బ్యానర్స్ కి సినిమాలు చేయాలని తెగ ఆరాటపడుతున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే బుచ్చిబాబు కథను పూర్తి చేశాడు. మైత్రీలో ఫుల్ కథను కూడా వినిపించాడు. కానీ, మైత్రీ మేకర్స్ కథ పై ఏ అభిప్రాయం చెప్పకుండా ఆ కథను తీసుకెళ్లి నానికి చెప్పామన్నారు. కథ విన్న నాని, అసలు బాగాలేదు అని డైరెక్ట్ గా చెప్పేసి వెళ్లిపోయాడట. పైగా అతనికి అసలు కథ పై క్లారిటీ లేదు అంటూ బుచ్చిబాబును ఉద్దేశించి పెదవి విరిచినట్లు టాక్.

ఆ పెదవి విరుపు మాటలు కాస్త బుచ్చిబాబు చెవులకు చేరాయి. వాటిని తీవ్ర అవమానంగా భావించి బుచ్చిబాబు తెగ ఫీల్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫుల్ నెరేషన్ ఇవ్వకుండానే తన కథ బాగాలేదు అనే టాక్ ను తేచుకున్నాడు బుచ్చిబాబు. పైగా ఈ కథను చేయడానికి బుచ్చిబాబు దాదాపు రెండు నెలలుగా హోటల్ కే పరిమితం అయిపోయి సీరియస్ గా కథను రాశాడు. కానీ బుచ్చిబాబు కథ పూర్తిగా తేలిపోయినట్లే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular