Homeఎంటర్టైన్మెంట్వారి గుండెలపై వేలాడే ఖరీదైన మంగళసూత్రాలు

వారి గుండెలపై వేలాడే ఖరీదైన మంగళసూత్రాలు

బాలీవుడ్ తారలు ఖరీదైన పర్సులు, బూట్లు, దుస్తులు మొదలైనవి ధరిస్తూ ప్రదర్శిస్తుంటారు. వాటి ధరతో ఒక లగ్జరీ కారు, బంగ్లా కొనుగోలు చేయవచ్చు. మరి వివాహిత నటీమణుల మంగళసూత్రాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాటి ధర వింటే కళ్ళు తిరగడం ఖాయం. దీపికా పదుకొనే నుండి అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ వరకు ఒక సామాన్యుడు కూడా కొనలేనంత ఖరీదైన మంగళసూత్రాలు ధరిస్తున్నారు.

దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లో 2018 లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం నిండుగా ఉండేందుకు దీపిక, రణవీర్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా దీపికా నలుపు బంగారు ముత్యాలు, సింగిల్ డైమండ్‌తో కూడిన మంగళసూత్రం ధరించింది. దీని ధర 20 లక్షల రూపాయలు. దీపికకు ముందు, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇటలీలో డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో, అనుష్క ధరించిన మంగళసూత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ మంగళసూత్రం విలువ రూ .52 లక్షలు.

ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పట్లో ఐశ్వర్య ధరించిన కంజీవరం పసుపు చీర ధర సుమారు 75 లక్షల రూపాయలు. ఐశ్వర్య ధరించిన మంగళసూత్రం ధర రూ. 45 లక్షలు. మరో నటి శిల్పి శెట్టి తన పెళ్లికి ఎంచుకున్న రెడ్ కలర్ చీర విలువ రూ .50 లక్షలు. అదే సమయంలో రాజ్ కుంద్రా ఆమెకు ఇచ్చిన ఉంగరం సుమారు 3 కోట్లు. కాజోల్, అజయ్ దేవగన్ వివాహం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మహారాష్ట్ర సంప్రదాయంలో జరిగిన ఈ వివాహంలో అజోయ్‌ 21 లక్షల రూపాయల విలువైన మంగళసూత్రాన్ని కాజోల్ కు అందించాడు. కరిష్మా కపూర్ వివాహం అయినప్పుడు విపరీతమైన చర్చ జరిగింది. అప్పట్లో కరిష్మా తనకోసం పింక్ కలర్ దుస్తులు ఎంచుకుంది. దానిపై వెండి-బంగారు దారంతో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అప్పుడు కరిష్మా ధరించిన మంగళసూత్రంలో వజ్రంతో కూడిన లాకెట్టు వుంది. దీని ఖరీదు సుమారు 17 లక్షల రూపాయలు.

హీరోయిన్ మాధురి దీక్షిత్ ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె అన్నింటినీ వదిలి, అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. మాధురి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె భర్త శ్రీరామ్ నేనే.. మాధురి దీక్షిత్ కు సుమారు 8 లక్షల రూపాయల విలువైన మంగళసూత్రం బహుకరించారు. మరోనటి సోనమ్ కపూర్‌ను ట్రెండ్ సెట్టర్‌గా పరిగణిస్తారు. ఆమె తన పెళ్ళికి ఆభరణాలు, ఇతర వస్తువులను తానే డిజైన్ చేసుకుంది. ఆమె మంగళసూత్రంలో తన, భర్త ఆనంద్ అహుజాల రాశిచక్ర చిహ్నాన్ని ఉంచింది.ఈ మంగళసూత్రం ధర 50 వేల రూపాయలు మాత్రమేనట.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular