Mahesh Babu: ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఈయన హీరో గా ఒక సైనిక వస్తుంది అంటే ఆ సినిమా మీద అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉంటాయి. అలాంటి మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఇండస్ట్రీలోనే అదొక హాట్ టాపిక్ గా మారింది .నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన అతడు ఖలేజా లాంటి సినిమాలు మంచి సక్సెస్ లను అందుకున్నాయి.
అయితే త్రివిక్రమ్ మీద నమ్మకం ఉంచిన మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ చెప్పిన అనిమల్ స్టోరీని రిజెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో గుంటూరు కారం సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే సందీప్ వంగ ఆ సినిమాని రన్బీర్ కపూర్ తో చేసి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 900 కోట్ల వరకు కలక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇది ఇలా ఉంటే గుంటూరు కారం తో త్రివిక్రమ్ మీద నమ్మకం నుంచి ఒక హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు మీద చాలా మంది సింపతిని చూపిస్తున్నారు.
అలాగే త్రివిక్రమ్ మీద కోపానికి వస్తున్నారు. నిజానికి మహేష్ బాబు కనక అనిమల్ సినిమా చేసి ఉంటే ఆయన ఒక వైల్డ్ ఒక బోల్డ్ సినిమాలో చేశారనే గుర్తింపు కూడా వచ్చి ఉండేది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చాడు. కానీ నటుడు అన్న తర్వాత అన్ని రకాల పాత్రలను పోషించాలి. కాబట్టి అనిమల్ సినిమా కూడా చేసి ఉంటే బాగుండేదని చాలామంది మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు చేసినప్పటికీ అనిమల్ లాంటి సినిమాలకి యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉంటుంది.
అనిమల్ సినిమా చేసిన రన్బీర్ కపూర్ తన కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టి బాలీవుడ్ మార్కెట్లో తను కూడా అత్యంత ప్రభావవంతమైన హీరో అని నిరూపించుకున్నాడు. అదే మహేష్ బాబు కనక చేసి ఉంటే మన తెలుగు హీరోకి మరొక మంచి హిట్ దక్కి ఉండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More