Homeఎంటర్టైన్మెంట్షాకింగ్ : క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూత!

షాకింగ్ : క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూత!

వివాదాస్పద వ్యక్తి కత్తి మహేశ్‌ పెను ప్రమాదం నుండి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆయన ఇక లేరు అనే చేదు వార్తను వినాల్సి రావడం బాధాకరం. ఆయన ఆరోగ్య రీత్యా ఆయనకు జరిగిన ప్రమాదం నుండి ఆయన బయట పడలేకపోయారు. చికిత్స పొందుతూనే ఈ సాయంత్రం కత్తి మహేష్ కన్నుమూశారు. చికిత్సకి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా ఆయన ఆరోగ్య ప‌రిస్థితి ఈ రోజు ఉదయం ఒక్కసారిగా విష‌య‌మించింది. దాంతో వెంటిలేటర్‌ […]

Kathi Maheshవివాదాస్పద వ్యక్తి కత్తి మహేశ్‌ పెను ప్రమాదం నుండి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆయన ఇక లేరు అనే చేదు వార్తను వినాల్సి రావడం బాధాకరం. ఆయన ఆరోగ్య రీత్యా ఆయనకు జరిగిన ప్రమాదం నుండి ఆయన బయట పడలేకపోయారు. చికిత్స పొందుతూనే ఈ సాయంత్రం కత్తి మహేష్ కన్నుమూశారు.

చికిత్సకి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా ఆయన ఆరోగ్య ప‌రిస్థితి ఈ రోజు ఉదయం ఒక్కసారిగా విష‌య‌మించింది. దాంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. క్రిటిక్ గా నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో కత్తి మహేష్ ఇక లేరు అనేసరికి ఆయన సినీ సన్నిహితులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

అసలు కత్తి మహేష్ కి ప్రమాదం ఎలా జరిగింది అంటే.. నెల్లూరు జిల్లాలో తన బంధువుల ఇంటికి వెళ్తూ ఉండగా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురి అయింది. అతి వేగంతో వెళ్తున్న ఆయన కారు నేరుగా వెళ్లి లారీని ఢీకొట్టింది. దాంతో కత్తి మహేశ్‌ కారుకి తీవ్ర ప్రమాదం జరిగి.. చివరకు ఆయన తన ప్రాణాలనే పోగొట్టుకున్నారు.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున క్రిటిక్ కత్తి మహేష్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper