Nagarjuna: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే కెరీర్ మొదట్లో కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నప్పటికీ నాగార్జున వాటన్నింటిని దాటుకొని తనలో ఉన్న నటుడిని బయటకి తీస్తూ సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తాయా లేదా అనే విషయం లో కూడా ఆయన అభిమానుల్లో పలు రకాల ప్రశ్నలైతే మెదులుతున్నాయి.
ఎందుకంటే రీసెంట్ గా ఆయన ‘నా సామి రంగా’ అనే సినిమాతో సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు నాగార్జున తన వందో సినిమా ఎవరితో చేయాలనే దానిమీద చాలా కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక దాదాపు సంవత్సరం నుంచి తన వందో సినిమా దర్శకుడి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఇక కొంత మంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు మళ్ళీ అందరూ కూడా కనుమరుగై పోతున్నారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆయన వందో సినిమా కోసం ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఒక తన వందో సినిమాను ఆయన చేతుల్లో పెడుతున్నాడట. అయితే ఆ అబ్బాయి ఎవరనేది క్లారిటీ గా తెలియకపోయినా వీళ్ళ ఫిలిం స్కూల్ లో చదివిన కుర్రాడి గా తెలుస్తుంది..ఇక డిఫరెంట్ సినిమాతో నాగార్జున తన వందో సినిమాను చేసి సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు. ఇక తన వందో సినిమా కోసం నాగార్జున దాదాపు సంవత్సరం నుంచి కష్టపడుతున్నప్పటికీ ఈ సినిమా విషయంలో నాగార్జునకు ఏదో తెలియని భయమైతే వెంటాడుతుంది.
ఒకవేళ మైల్ స్టోన్ సినిమాగా మిగిలిపోవాల్సిన సినిమా ఫ్లాప్ అయితే ఎలా అనే ఉద్దేశ్యం తోనే తను బాగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా తెలిసిన అభిమానులు మాత్రం సినిమా ఎవరితో చేసిన వందో సినిమా సక్సెస్ కొడితే బాగుంటుందని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…