Homeఎంటర్టైన్మెంట్Mithun Chakraborty: బుక్కెడు తిండి కోసం డ్యాన్స్ లు చేయాల్సి వచ్చింది..ఈ స్టార్ హీరో జీవితం...

Mithun Chakraborty: బుక్కెడు తిండి కోసం డ్యాన్స్ లు చేయాల్సి వచ్చింది..ఈ స్టార్ హీరో జీవితం తెలిస్తే కన్నీళ్లు ఆగదు

Mithun Chakraborty: జీవితం అంటే పూలపాన్పు కాదు. లక్ష్యాన్ని చేరడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. అయితే ఈ కష్టంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు కొంచెం కష్టపడితే అత్యున్నత శిఖరాలకు చేరుతారు. మరికొందరు ముళ్ల కంపలపై నడిస్తే గానీ.. అనుకున్న జీవితాన్ని పొందలేరు. ఇలాంటి జీవితాలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారివి ఎక్కువగా ఉంటాయి. గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు కోసం ఎంతో మంది ఆరాట పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కొందరు ఆ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగి.. ఆ తరువాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయితే ఓ స్టార్ హీరో తన పాత రోజుల్లో కనీసం తిండి కూడా దొరకని రోజులు గడిపానని అంటున్నారు. ఒక్కపూట అయినా భోజనం దొరికితే చాలు.. అని అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు స్టార్ రేంజ్ లో కొనసాగుతున్నారు.ఆయన జీవితం గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి.

ప్రతీ పెళ్లి భారత్ లో ఒకప్పుడు ‘ఐయామ ఏ డిస్కో డ్యాన్సర్’ అనే పాట కచ్చితంగా వినిపించేది. పబ్బుల్లో అయితే ఈ పాట లేకుండా ఉండదు. ఈ సాంగ్ లో కుర్రాళ్లకు మంచి జోష్ నింపేలా నటించారు మిథున్ చక్రవర్తి. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్న మిథున్ చక్రవర్తి ఒకప్పుడు బంపర్ హిట్టు సినిమాలు చేశారు. మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన ‘మృగయ’ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువత సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ఫ్యార్ ఝుక్తా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన ‘గోపాల గోపాల’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మిథున్ చక్రవర్తి జీవితం మిగతా వారికంటే భిన్నంగా ఉండేది. తన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఓ షోలో ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు అనుభవించిన కఠిన జీవితం గురించి చెప్పాడు. ఆకలి కేకలతో ఎన్నో రోజులు పస్తులుండాల్సి వచ్చిందని తెలిపాడు. నిద్రపోయే ముందు కాస్త తిండి దొరికితే బాగుండు.. అని అనుకునేవాడు. ఇలా చాలా సార్లు తిండి లేక ఫుట్ ఫాత్ లపై పడుకున్న రోజులు ఉన్నాయని అన్నారు.

అయితే కొన్నాళ్ల తరువాత సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న కోరకతో అక్కడక్కడా డ్యాన్స్ లు చేసేవారు. ఒక వైపు అవకాశం దొరికిన చోట డ్యాన్సులు చేస్తూ .. మరోవైపు తిండి కోసం ఏ పని దొరికినా చేసేవాడిని అని చెప్పాడు. అలా కొన్నాళ్ల తరువాత సినిమాల్లోకి అవకాశం వచ్చింది. అయితే హీరో అవ్వాలన్న కోరిక ఎప్పుడు ఉండేది కాదు. అందుకే విలన్ పాత్రలను చాలా ఇంట్రెస్టుగా చేసేవాడు. అయితే యూత్ కు మాత్రం మిథున్ చక్రవర్తి ఓ మెసెజ్ చెప్పాడు. ప్రతి ఒక్కరి జీవితం కష్టంగానే ఉంటుందని అనుకోవాలి. చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని ముగించరాదని సలహా ఇస్తున్నాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper