Divyanka Tripathi: ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఎంత ఎత్తుకైన ఎదుగుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి. అడిగినదానికి లొంగకపోతే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినా వణికిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిన్నా చితకా పనులు చేసుకుంటూ కాలం గడిపింది. చివరికి చెత్త ఏరుకొని రూపాయి రూపాయి కూడబెట్టింది. ఈ రోజుల లక్షలు సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి. ఈమె యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 2005లో మిస్ భోపాల్ గా కిరీటం అందుకుంది.
బనూ మే తేరి దుల్హన్ సీరియల్ తో క్లిక్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది ఈ బ్యూటీ. ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు అనుకున్న సమయంలో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నిత్యావసరాలు, ఈఎంఐలు ఇలా అన్నింటికీ డబ్బులు అవసరమయ్యాయి. అందుకోసం ఏం చేయటానికి అయినా సిద్ధపడింది దివ్యాంక. పైగా తనకు పెంపుడు కుక్క ఉందట. చిన్న చిన్న పనులు చేసి 2000 నుంచి 5000 వరకు వచ్చిన కిరాణా సామాను తెచ్చుకోవచ్చు అనుకుందట.
చిన్న పాత్రలు ఇచ్చినా సరే చేస్తానంటూ డైరెక్టర్ లను వేడుకుందట. అట్టముక్కలను, టూత్ పేస్ట్ డబ్బాలను సేకరించి అమ్ముకుందట. ఒక డబ్బాకి ఒక రూపాయి ఇచ్చేవాళ్లట. అలా రోజు చెత్తను సేకరించి దాన్ని అమ్మి డబ్బు సంపాదించింది. అంతకుముందు దాచుకున్న డబ్బుతో ప్రతినెలా ఈఎంఐలు కట్టింది. సరిగ్గా అదే సమయంలో తనకి రాత్రికి వస్తానంటే మంచి ఛాన్స్ ఇస్తామని ఆఫర్ వచ్చిందట. కానీ ఆమె ఒప్పుకోలేదట.
అడ్డదారులు తొక్కి సంపాదించే బదులు సొంతగా కష్టపడాలి అనుకుందట. తర్వాత ఏహే మొహబ్బతే ధారావాహికలో డాక్టర్ ఇషిత అయ్యర్ గా ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దివ్యాంక ఇప్పుడు ఒక ఎపిసోడ్ కి లక్ష నుంచి రూ. 1,50,000 అందుకుంటుంది. ఇక 2017లో ఫోర్స్బ్ సెలబ్రెటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బుల్లితెర నటిగా రికార్డును సంపాదించింది.