Poonam Kaur
Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా స్టోరీ ని త్రివిక్రమ్ కాపీ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖ నవల రచయిత్రి అయిన యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ చేశాడు అంటూ త్రివిక్రమ్ పైన ఆరోపణలు వస్తున్నాయి.
ఇక ఈ విషయం మీద ఒకప్పటి హీరోయిన్ అయిన పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదిక గా ఒక ట్వీట్ చేశారు.దాంట్లో ఆమె ఇలా రాసుకోచ్చారు “త్రివిక్రమ్ కీర్తి కిరీటాలను కాపీ చేశారు అని అంటున్నారు.ఆయన ఏదైనా చేయగలరు దాని నుంచి తప్పించుకోగలరు. ఆయన చేసిన తప్పులు ఎవరికీ కనిపించవు. గత ప్రభుత్వంలో ఈయనకి సీఎం ఆఫీస్ కి వెళ్లడానికి ప్రత్యేక యాక్సిస్ ఉండేది అలా ఎందుకు ఉండేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు” అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. అయితే పూనమ్ కౌర్ చాలా రోజుల నుంచి కామ్ గా ఉంటుంది కానీ ఆమెకి నచ్చినప్పుడు ఇలా నచ్చిన విధంగా ట్వీట్ చేస్తూ అందరిలో తన మీద అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య ఉన్న రిలేషన్ షిప్ త్రివిక్రమ్ వల్లే బ్రేక్ అయింది అనే ఉద్దేశ్యం లో తను త్రివిక్రమ్ మీద కోపంగా ఉందంటూ కొంతమంది సినీ పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక అప్పటినుంచి తనకు నచ్చిన విధంగా ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మీద వస్తున్న కాపీ ఆరోపణలు నిజమేనా ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ కాపీ చేశాడా అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఆయన కాపీ చేసాడా లేదా అనే విషయం తెలియాలంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఇలాంటి తరుణంలోనే ఆమె చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది…