40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో అన్నీ అద్భుతాలే జరిగాయంటే అతిశయోక్తి కాదేమో.. ఏకంగా ప్రధాని మోడీ లాంటి వారు కూడా చంద్రబాబు పోలవరంను ‘ఏటీఎం’లా వాడేశారని విమర్శిస్తే ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సీబీఐకి చిక్కిన ఆడిట్ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ పోలవరం కాంట్రాక్టును పట్టిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి లెక్కలు చూస్తే కానీ అసలు విషయం అందరికీ బోధపడక మానదు..
జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ పనుల కోసం స్కూటీలను, ఆటోలను వాడి కట్టేశాడంటే రాయపాటినా మజాకా అని అనక మానరు. నిజంగా నిజం ఇదీ.. పోలవరం కాంట్రాక్ట్ పనుల్లో రాయపాటి కంపెనీ చూపెట్టిన లెక్కాపద్దలు చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే మరీ.
పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో విచిత్రం రాయపాటి కంపెనీలో ఆటోలు, స్కూటీలు, కార్లలో వందల టన్నుల స్టీల్ తరలించినట్టు చూపించారు. ఇది రాయపాటి రేంజ్ మరీ. మరీ స్కూటీల్లో స్టీల్ ఎలా తీసుకెళుతారా అని బుర్రలు బద్దలు కొట్టుకోకండి రాయపాటి స్టైలీ అదీ మరీ..
స్టీల్, ఇసుక లాంటి భారీ మెటీరియల్ తరలించాలంటే లారీలు, డీసీఎం వ్యానులు లాంటి పెద్ద వాహనాలు అవసరం. కానీ పోలవరం స్టీల్, ఇసుకను , మెటీరియల్ ను ద్విచక్రవాహనమైన స్కూటీపై తరలించారని లెక్కలు చూపారు. టన్నుల కొద్దీ ఉక్కు ఈ స్కూటీపై ఎలా తరలించారో రాయపాటికే తెలియాలని సీబీఐ అధికారులు నోరెళ్ల బెట్టారట..
అసలే కొనుగోలు చేయని స్టీలు, ఇనుమును అధిక ధరలకు కొన్నట్టు చూపించి ఏకంగా రాయపాటి కంపెనీ రూ.907.10 కోట్లను లూటీ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ విస్తుపోయే అక్రమాల లెక్కలు బయటపడ్డాయట.. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు హయాంలో పోలవరంలో ఎన్ని చిత్ర విచిత్రాలు జరిగాయో సీబీఐ ఆడిట్ చూస్తే అందరికీ అర్థమవుతున్నట్టే కదా..