Gamanam: పలు ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కించిన చిత్రం” గమనం”.ఈ డిసెంబరు 10న థియేటర్ లో సందడి చేయనుంది. ప్రధాన పాత్రలో శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, నిత్యామేనన్ నటించారు.ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.క్రియ ఫిల్మ్ క్రాప్, కాళీ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించారు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ సందర్భంగా విలేకరులతో సినిమా ముచ్చట్లు ముచ్చటించారు దర్శకురాలు సృజనా రావు.జీవిత ప్రయాణం గురించి చెప్పడమే “గమనం” పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే జీవిత సంఘటనలను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది అని డైరెక్టర్ సృజనా రావు అన్నారు.తొలుత సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉండేది అయితే ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి’ అని నాన్న చెప్పారు ఆ తర్వాత నాన్న సపోర్ట్ చేశారు.
చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్లకు వెళ్లినప్పుడు సెట్లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పటినుండి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నా చిన్నతనం నుండి చూస్తూ వచ్చిన వాస్తవ సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. ముందుగా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. ఈ కథ శ్రియకి చెప్పగానే ఎమోషనల్ అయ్యి నన్ను గట్టిగా హత్తుకున్నారు.ఈ కథ ఇళయరాజాగారికి చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు.ఆయనకు కథ చెప్తున్నప్పుడు మధ్యలో ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రం తర్వాత మరో కథను సిద్ధం చేసుకున్నాను త్వరలో దాని గురించి అధికారిక ప్రకటన చేయను ఉన్నాను అని చెప్పుకొచ్చారు దర్శకురాలు.