Director Shankar: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సాధారణంగా చెప్పుకునే మాట. ఫిల్మ్ ఇండస్ట్రీ లో సినీతారలు ఎక్కువగా ఈ మాట చెబుతుంటారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ మాత్రం ముందు నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్గా మారింది. అదితీ ప్రస్తుతం కోలీవుడ్లో కార్తీ హీరోగా నటిస్తున్న ‘విరుమన్’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె వెండితెరకు పరిచయమవుతోంది. సూర్య- జ్యోతిక దంపతులు సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చెన్నై నగరంలోని ఓ ప్రముఖ డీమ్డ్ యూనివర్శిటీలో వైద్య కోర్సును పూర్తి చేసిన అదితీ తాజాగా జరిగిన వర్సిటీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో డిగ్రీ సర్టిఫికెట్ను అందుకుంది.

Also Read: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు
తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆమె ఈ ఎంబీబీఎస్ పట్టాను అందుకుంది. కాగా ఈ కార్యక్రమానికి అదితి తండ్రి డైరెక్టర్ శంకర్, తల్లి ఈశ్వరి, సోదరుడు అర్జిత్ శంకర్ తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది అదితి. ‘లేట్ నైట్స్, కాఫీ కప్పులు.. ఇలా ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నేను ఇప్పుడు అధికారికంగా డాక్టర్నయ్యాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O
— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021
Also Read: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్స్టాలో రష్మిక వీడియో పోస్ట్.. లక్షల్లో లైక్లు