Chiru: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శక్వంలో రానున్న సినిమా భోళా శంకర్. తమిళ్లో హిట్గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. కాగా, ఇటీవల భోళాశంకర్ తొలి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తొలి రోజు షూటింగ్ బాగా జరిగిందని మెహర్ రమేశ్ పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోతో పాటు.. పెద్దమ్మ తల్లి ఆశిస్సులతో తొలి రోజు షూటింగ్ బాగా అయ్యింది. అని పోస్ట్ చేశారు.
https://www.instagram.com/p/CWRvxB-vs77/?utm_source=ig_web_copy_link
మెగాస్టార్ ఈ సినిమా కోసం తన లుక్నే మార్చనున్నారు. పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఇటీవల కాలంలో చిరు గుండు లుక్లో కనిపించడం అందుకు ఉదాహరణ. ఆ లుక్ ట్రయల్స్ ఈ సినిమా కోసమేనంటూ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. మెహర్ రమేశ్ కూడా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరోలను మంచి స్టైలిష్గా చూపించడంలో రమేశ్కు మంచి టాలెంట్ ఉంది. మరి మెగాస్టార్ను ఎలా చూపించనున్నారో వేచి చూడాలి.
ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా తీస్తున్నారు చిరు. వచ్చే ఏడాది ఫిబ్రవరి4న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రామ్చరణ్ కూాడా నటిస్తున్నారు. కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఇటీవల ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు చిరు.