Homeఎంటర్టైన్మెంట్Star Heroine: ఒకప్పుడు డైపర్లు మార్చింది...కట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయ్యింది... ఇంతకీ ఆ అమ్మడు...

Star Heroine: ఒకప్పుడు డైపర్లు మార్చింది…కట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయ్యింది… ఇంతకీ ఆ అమ్మడు ఎవరంటే..?

Star Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అనేది చాలా కష్టమైన పని.. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అలాగే తమను తాము నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే మంచి పాత్ర కూడా దొరకాలి. ఇవన్నింటిని దాటుకొని ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టమైన పని అనే చెప్పాలి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి ‘ఫగ్లి ‘అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ‘కియారా అద్వానీ’ మాత్రం ఆ సినిమాతోనే నటి గా మంచి పేరు తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుందనే చెప్పాలి. ఫగ్లీ సినిమా తర్వాత ఆమె ‘ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఎప్పుడైతే ఈ సినిమాలో నటించిందో ఆమెకి మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ స్టేటస్ ని కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు కూడా పరిచయమైంది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో ఇక్కడ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్లు అయితే రావడం లేదు. ఆమె హిందీలోనే సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక అందులో భాగంగానే గుడ్ న్యూస్, కబీర్ సింగ్, షేర్షా లాంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు కూడా సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారే కంటే ముందు తను ఏం చేసేదో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. వాళ్ళ అమ్మ నిర్వహిస్తున్న ఒక ప్రీ స్కూల్లో నర్సరీ టీచర్ గా పనిచేసేదట. ఇక పిల్లలకి రైమ్స్ చెప్పడం, అక్షరాలు నేర్పించడం, డైపర్లు కూడా మారుస్తూ వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకునేదట. ఉదయం ఏడు గంటలకే తను స్కూల్ కి వెళ్ళిపోయి పిల్లలు ఇంటికి వెళ్లే సమయం దాకా తను అక్కడే ఉండి పిల్లలతో గడిపేదట.

ఇక దానివల్లే గుడ్ న్యూస్, కభీర్ సింగ్ సినిమాల్లో తను గర్భిణీ లేడీ గా నటించినప్పుడు కూడా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని మొత్తానికైతే ఆ స్కూల్లో నేను పనిచేయడం అనేది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని తను ఆ ఇంటర్వ్యూ చెప్పడం విశేషం… ఇక షేర్షా సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిన ఈ అమ్మడు 2023 వ సంవత్సరంలో వాళ్ల ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు… ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరికి కలిపి 150 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తుంది…ఇక ఒకప్పుడు పిల్లలకు డైపర్స్ మారుస్తూ ఉండే అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular