ప్రముఖ తెలుగు కమెడియన్ పృథ్వీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసి పార్టీ అధికారంలోకి రాగానే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ అవ్వడం జరిగింది.. అయితే ఓ మహిళలతో అసభ్యంగా మాట్లాడాడంటూ పృథ్వీ ఫై ఆరోపణలతో పాటు ఆడియో టేపులు బయటకు రావడంతో ఆ పదవి కాస్తా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ‘‘నేను పార్టీకి విధేయుడైన కార్యకర్తని. అందుకే ఆరోపణలు రాగానే నా పదవికి రాజీనామా చేశాను. నాకు పార్టీపై చాలా నమ్మకం ఉంది. నాకు ఆ పదవి దక్కడం కొందరికి నచ్చలేదు. నాపై కుట్ర చేసి నన్ను ఆ తప్పులో ఇరికించారు. పీఏ, పి.ఆర్.ఒ లను నమ్ముకుని మోసపోయాను. నన్ను కుట్ర చేసి బయటకు పంపారు. ఆయతే నాపై ఆకారణంగా కుట్ర చేసిన వాళ్లెవరూ ఈరోజు బతికి లేరు. నా జాతకమే అంత’’ అన్నారు.
ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు పోయాయి కదా! అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ సమయంలో . తెలుగు సినీ ఇండస్ట్రీలో నన్ను ఓదార్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి అని ,ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, నాపై ఆరోపణలు వచ్చినప్పుడు నా గురించి అందరికీ మానసికంగా బాధపడుతున్నానని చెప్పడమే కాకుండా, నాకు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేయమని కూడా చెప్పారు అని పృథ్వీ అన్నాడు..ఆయన లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడినని కూడా పృథ్వీ తెలిపారు. ఈ విషయంలో కొస మెరుపు ఏమిటంటే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య చిత్రం లో పృథ్వి ఒక మంచి పాత్ర పోషిస్తున్నాడు.
A friend in need is a friend indeed
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Comedian prudhvi praises chiranjeevi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com