Brahmanandam: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈరోజు ఉదయం కృష్ణంరాజు ఇంటికి బ్రహ్మీ వెళ్లారు. అనంతరం కృష్ణం రాజుతో కొంత సమయం సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత తాను గీసిన సాయిబాబా చిత్రపటాన్ని… ఆయనకు బహుమతిగా అందించారు.

ఈ స్పెషల్ సర్ప్రైజ్ పట్ల కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బ్రహ్మానందంతో దిగిన ఫొటోలను కృష్ణంరాజు షేర్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ లో ” మన కామెడీ జీనియస్ ఆర్ట్లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్ప్రైజ్’అంటూ పలు ఫోటోలను షేర్ చేశారు కృష్ణం రాజు.
The comedy genius is an art genius as well. Such a beautiful person with wonderful talent. Thank you for this sweet surprise. God Bless you #Brahmanandam. pic.twitter.com/MPnWkwpeAY
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) October 30, 2021
ఇటీవల కృష్ణంరాజు ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు గాయం అయినట్లు వార్తలు రావడం చూశాం. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్లో చేర్చి… శస్త్ర చికిత్స నిర్వహించినట్టు పలు కధనాలు వచ్చాయి. కానీ కృష్ణంరాజు సన్నిహితులు మాత్రం రొటిన్ చెకప్ లో భాగంగా … అపోలో హాస్పిటల్కు వెళ్లారని చెప్పుకొచ్చారు.
కాగా గతంలో బ్రహ్మానందం అల్లు అర్జున్, రానాలకు కూడా తాను స్వయంగా గీసిన చిత్రపటాలను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మీ… ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తున్నాడు. అలానే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’ అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు.