Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్... అమర్ కి ఎసరు పెడుతున్న రైతు బిడ్డ,...

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్… అమర్ కి ఎసరు పెడుతున్న రైతు బిడ్డ, ఉత్కంఠగా టికెట్ టు ఫినాలే రేస్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అందరికంటే తక్కువ పాయింట్లు సాధించిన శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక లు రేస్ నుంచి తప్పుకున్నారు. కాగా యావర్ కూడా ఫినాలే రేస్ నుంచి తప్పుకుని .. పాయింట్లు ప్రశాంత్ కి ఇచ్చేసాడు. దీంతో స్కోర్ బోర్డు లో రెండవ స్థానంలో నిలిచాడు ప్రశాంత్. ఇక అమర్ దీప్ మాత్రం స్కోర్ బోర్డు లో మొదటి స్థానంలో దూసుకుని పోతున్నాడు.

కాగా ఫినాలే రేస్ లో భాగంగా కంటెస్టెంట్స్ కి’ పట్టుకో తెలుసుకో ‘అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రేస్ లో కొనసాగుతున్న గౌతమ్, ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్ లు పోటీ పడ్డారు. ఇందుకు పోటీ దారులు తమ కళ్ళకు గంతలు కట్టుకుని బిగ్ ఇచ్చిన ఐటమ్స్ చేత్తో పట్టుకుని అది ఏంటో గెస్ చేసి చెప్పాలి. ఎవరు ముందుగా కరెక్ట్ ఆన్సర్ చెబితే వాళ్లకు పాయింట్ లభిస్తుంది. కాగా ఈ టాస్క్ లో సంచాలకులుగా శోభా శెట్టి, యావర్ వ్యవహరించారు.ఇక అమర్ దీప్, ప్రశాంత్ లు టక టకా సమాధానాలు చెప్పారు. నేను అంటే నేను అంటూ గొడవ పడ్డారు.

వీళ్ళకి సంచాలక్ శోభా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత బిగ్ బాస్ చికెన్ పంపిస్తే దాచుకుందాం అని యావర్ తో అన్నది శోభా. దీనికి బిగ్ బాస్ కూడా ఓకే చెప్పేసాడు. నీ ఇష్టం శోభా అన్నట్లుగా చికెన్ ఉంచుకుని .. ప్లేట్లు మాత్రం పంపించు అని చెప్పారు. ఇక అర్జున్ ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. దీంతో ‘ నేను కూడా ఈ టాస్క్ అక్కడ కూర్చుని చూస్తా బిగ్ బాస్’ అంటూ జోక్ చేసాడు.

అయితే చివర్లో యావర్ .. అమర్ కి షాక్ ఇచ్చాడు. అమర్ దీప్ కళ్ల జోడు పెట్టుకుని చూశాడు. ఇంతలో శివాజీ వచ్చి కనిపిస్తుందరా .. అని అడిగాడు. 100 పర్సెంట్ కనిపిస్తుందన్నా అని యావర్ చెప్పాడు. దీంతో అమర్ హర్ట్ అయ్యాడు. మీకు నేను ఆడితేనే వస్తాయి ఇలాంటి డౌట్లు .. వేరే వాళ్ళు ఆడితే రావు. వేరే వాళ్ళు సాధిస్తే మాత్రం చంకలు గుద్దుకుంటారు. నేను ఆడితేనే డౌట్లు అంటూ అలిగి వెళ్ళిపోయాడు.

టికెట్ టు ఫినాలే లో భాగంగా రేసులో ఉన్న అమర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్ లకు కఠిన టాస్క్ ఇచ్చాడు. ఒక చేత్తో బంతిని తలకంటే పైన ఉంచి కాళ్ళు చేతుల సప్పోర్ట్ లేకుండా బాక్స్ పై కూర్చోవాలి. ఈ టాస్క్ లో అమర్ మొదటిగా అమర్, తర్వాత గౌతమ్, అర్జున్ నిష్క్రమించారు. పల్లవి ప్రశాంత్ ఎక్కువ సమయం బాల్ బ్యాలన్స్ చేసి విన్నర్ అయ్యాడు. దాంతో పాయింట్స్ పట్టికలో అమర్ తో సమానంగా ఉన్నాడు. కనీసం టికెట్ టు ఫినాలే గెలవాలన్న అమర్ ఆశలకు ప్రశాంత్ గండి కొట్టేలా ఉన్నాడు.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular