spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: తల్లిని తలచుకుని యావర్ బ్రదర్స్ కన్నీరు మున్నీరు,...

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: తల్లిని తలచుకుని యావర్ బ్రదర్స్ కన్నీరు మున్నీరు, గుండెలు బరువెక్కించే ఎమోషన్స్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ మొదలైనప్పటి యావర్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ తల్లిని చూసి యావర్ భోరున ఏడ్చాడు. ఆమె యావర్ ని దగ్గరకు తీసుకుని ‘ నువ్వు కూడా నా కొడుకువే’ ఏడవకు అంటూ ఓదార్చింది. ఇక రోజు శోభా శెట్టి తల్లి యావర్ ని పట్టుకుని ‘నిన్న ఎందుకు ఏడ్చవ్ .. మా అమ్మ కదా .. అమ్మా లేదనా ఇదిగో మీ అమ్మా ఎప్పుడు నీతోనే ఉంటుంది అంటూ యావర్ తల్లి ఫోటో ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక సీన్ చూస్తే ఆడియన్స్ కళ్ళు చెమ్మగిల్లాల్సిందే.

కాగా యావర్ అన్న అహ్మద్ నేడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందు కాసేపు మెయిన్ డోర్స్ ఓపెన్ చేస్తూ .. క్లోజ్ చేస్తూ కంటెస్టెంట్స్ తో ఆడుకున్నారు బిగ్ బాస్. తర్వాత యావు .. మేరా .. బచ్చా అంటూ హౌస్ లోకి వచ్చిన అన్నను పట్టుకుని తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు యావర్. తర్వాత గౌతమ్ తో మాట్లాడుతూ ‘ మాకు చిన్నపట్నుంచి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు అందుకే వాడు మీ అమ్మని చూసి అంత ఎమోషనల్ అయ్యాడు అని చెప్పాడు యావర్ అన్న.

తర్వాత యావర్ తో ‘నువ్వు స్ట్రాంగ్ రా .. స్ట్రాంగ్ గా ఆడు.. కప్ గెలవాలి అంటూ ధైర్యం నింపాడు. మాకు తల్లి ప్రేమ తెలియదంటూ శివాజితో చెప్తూ సుజా అహ్మద్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ సమయం అయిపోయింది అని చెప్పడంతో అందరికి బై బై చెప్పి ‘సుజా అహ్మద్ బ్రదర్ ఆఫ్ యావర్ అహ్మద్’ అంటూ గర్వంగా చెప్పాడు.

వీళ్ళని చూస్తే అన్నదమ్ములు అంటే ఇలా కదా ఉండాలి అనిపిస్తుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన యావర్ కి అన్నీ తానై పెంచాడు సుజా అహ్మద్. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి యావర్ అన్నని తలుచుకుని చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ రోజు అన్నదమ్ములు ఇద్దరు అందరిని ఏడిపించేసారు. ఈ అన్నదమ్ముల బంధం హార్ట్ టచింగ్ గా ఉంది.

అలాగే అమర్ దీప్ భార్య తేజస్విని సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ అమర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తేజస్విని రావడం లేదు, అందుకు బదులుగా కేక్ పంచిందని అబద్దం చెప్పాడు. నిజమే అని నమ్మిన అమర్ బాధపడ్డాడు. కేకు తీసుకుని బయటకు వచ్చాడు. హౌస్లో అప్పటికే తేజస్విని ఉంది. ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు. నిన్ను చాలా మిస్ అయ్యాను. ఒంటరిగా ఏడ్చాను అని అమర్ అన్నాడు. అమర్ చిన్నపిల్లాడు అని తేజస్విని హౌస్ మేట్స్ తో చెప్పింది.

శోభ శెట్టి తల్లి రావడంతో ఆమె ఎగిరి గంతులు వేసింది. అనూహ్యంగా యావర్ కోసం ఆమె బహుమతి తెచ్చింది. యావర్ తల్లి ఫోటో తేవడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. శోభ తల్లి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. మొత్తంగా గురువారం ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గా ముగిసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Oktelugu Epaper