Bala Krishna: నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం హోస్ట్ అవతారంతో ప్రేక్షకులను అలరించారు. అయితే ప్రస్తుతం కొడుకు రూట్ కి వస్తున్న బాబాయ్ బాలకృష్ణ కూడా హోస్ట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇదిలా ఉండగా ఆహా షో ద్వారా బాలయ్య అందుకుంటున్న ఈ భారీ పారితోషకం ఛారిటీకి ఇస్తున్నారని సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు.
బాలయ్య టాక్ షో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు ఎప్పుడు మాస్ ఎంటర్టైన్మెంట్ అందించే బాలయ్య టాక్ చేస్తారంటే ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. ఆహా’ ఓటీటీ లో అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె ‘ అంటూ ఆహలో అలరించబోతున్నారు బాలయ్య. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య కొన్ని ఎపిసోడ్ లు షూట్ కూడా పూర్తి చేశారని సమాచారం.
తొలి సీజన్లో 12 ఎపిసోడ్లుగా ‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె ‘ ప్రసారం కాబోతోందని సమాచారం. ఈ షో కోసం బాలయ్య తన స్థాయికి తగ్గట్లే భారీగా పారితోషకం అందుకున్నారట అని వార్తలు వస్తున్నాయి. ఎపిసోడ్కు రూ.40 లక్షల చొప్పున.. మొత్తంగా రూ.4.8 కోట్ల మొత్తం రెమ్యూనరేషన్గా బాలయ్య అందుకోన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఓటీటీ లో ప్రసారమయ్యే షో కు అది కూడా ఒక్క సీజన్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. షో సందర్భంగా తన పే చెక్ను ఛారిటీకి ఇవ్వబోతున్నట్లు ప్రకటన కూడా చేయనున్నాడని సినీ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇదే నిజమైతే బాలయ్యది గొప్ప మనసని మరో సారి చాటుకున్నట్లే.
ఓవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగునివ్వడమే కాక….. తన పుట్టినరోజు సందర్భంగా కూడా అనాధ పిల్లలతో సరదాగా సమయం గడుపుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినవి.వ్యక్తిగతంగా కూడా బాలయ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.