Annapoorna: ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న షోలలో ఒకటైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఊహించని స్థాయిలో హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా కూతురి మరణాన్ని తలచుకుంటూ అన్నపూర్ణ ఎమోషనల్ అయ్యారు. సమ్మర్ స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుండగా సుధీర్ ప్రోమోకు హైలెట్ గా నిలిచారు. లేడీ కమెడియన్ సాయంత్రానికి ఇది ఎండిపోతుందా అని అడగగా ఈ ఎండకు నువ్వే ఎండిపోతునావ్ ఇవి ఎండకుండా ఉంటాయా అని అన్నపూర్ణ కామెంట్ చేశారు.
శ్రీవాణి ఈ వడియాలు అన్నీ చూస్తుంటే తన నోరు ఊరిపోతుందని చెప్పగా శ్రీవాణి భర్త ఊరుతోంది ఊరుతోంది అంటూ శ్రీవాణి ఊరంత అయ్యిందంటూ కామెంట్ చేశారు. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఉట్టి మీద కూడు పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేసి మెప్పించారు. రామ్ ప్రసాద్ ఆవకాయ్ పెట్టాలంటే ఏం చేయాలని అడగగా శ్రీలక్ష్మి ముందు మామిడికాయ ముక్కలు కోయాలని చెబుతుంది. రామ్ ప్రసాద్ వెంటనే ముందు కోస్తే వెనకాల ఏం చేయాలని అడుగుతాడు.
Also Read: Prabhas Maruthi Movie: అందుకే అతనితో ఒప్పుకున్నా.. ప్రభాస్ ఫుల్ క్లారిటీ !
ఆ తర్వాత రామ్ ప్రసాద్ సుధీర్ ను పచ్చడి అమ్మి డబ్బులు పట్టుకునిరావాలని చెప్పగా సుధీర్ పచ్చడి అమ్ముతాడు. శ్రీవాణి భర్త ప్రోమోలో చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ఆ స్కిట్ ను చూసిన అన్నపూర్ణమ్మ ఎమోషనల్ అయ్యారు. ఇందులో తల్లీదండ్రులు చనిపోయారని రియల్ లైఫ్ లో నాకు కూతురు పోయిందని ఆమె చెప్పుకొచ్చారు. చాలామంది ముందు మనం బాధ పడలేమని అన్నపూర్ణ తెలిపారు.
కంచంలో అన్నం పెట్టుకునే సమయంలో, తెల్లవారుజామున, అర్ధరాత్రి సమయంలో కూతురు గుర్తొచ్చి బాధ వేస్తుందని ఆమె అన్నారు. ఇంద్రజ అన్నపూర్ణ గారిని ఓదార్చారు. ఈ సమయంలో మా పాప గురించి చెప్పినందుకు ప్రేక్షకులంతా మన్నించాలని అన్నపూర్ణ కామెంట్లు చేశారు.
Also Read: Prabhas: ప్రభాస్ సీక్రెట్ పిక్ లీక్.. షాక్ లో టీమ్
Recommended Videos:
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Annapoorna emotional comments in sridevi drama company details here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com