Homeఎడ్యుకేషన్Food challenge: దోశ తింటే సులువుగా రూ.71 వేలు గెలిచే అవకాశం.. ఏ విధంగా అంటే?

Food challenge: దోశ తింటే సులువుగా రూ.71 వేలు గెలిచే అవకాశం.. ఏ విధంగా అంటే?

Food challenge: మనలో చాలామంది ఇష్టపడే వంటకాలలో దోశ ఒకటనే సంగతి తెలిసిందే. అయితే దోశ తినడం ద్వారా సులభంగా  71,000 రూపాయలు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 40 నిమిషాలలో దోశ తింటే మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు అవుతారు. ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ ఈ ఆఫర్ ను ప్రకటించగా ఈ పోటీలో ఓడిపోతే మాత్రం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

Food challenge
Food challenge

వినడానికి బాగానే ఉన్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా ఈ పోటీలో విజయం సాధించలేదు. ఢిల్లీలోని శక్తి సాగర్ రెస్టారెంట్ ఈ అద్భుతమైన ఆఫర్ ఉండగా పది అడుగుల దోశను తినడం ద్వారా 71,000 రూపాయలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫుడ్ లవర్స్ ఈ పోటీలో పాల్గొనడం ద్వారా సులభంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. 30 కంటే ఎక్కువమంది ఇప్పటివరకు ఈ పోటీలో పాల్గొన్నారని బోగట్టా.

Also Read: కాపులపై వైసీపీ ప్రేమ.. తుని ఘటనలో కేసులు ఎత్తివేత

ప్రముఖ రెస్టారెంట్లు పాపులారిటీ పెంచుకోవాలనే ఆలోచనతో ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి ఢిల్లీకి వేర్వేరు ప్రాంతాల నుంచి తిండిప్రియులు వస్తుండటం గమనార్హం. ఫుడ్ తినడాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లు ఈ పోటీలో పాల్గొనడం ద్వారా తమ లక్ ను పరీక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎంత కష్టపడినా పోటీలో గెలవలేకపోయామని పోటీలో పాల్గొన్న వాళ్లు చెబుతున్నారు.

ఈ పోటీ చెప్పడానికి సింపుల్ గా అనిపించడానికి తినడం మాత్రం అంత తేలిక కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దోశను ఇష్టపడే వాళ్లకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్ష‌ల‌తో చెక్ పెట్టే య‌త్నం?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular