ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఐటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. 45 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ ఎస్ఎస్సీ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల భర్తీ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి నెల నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రారంభం కానుంది. అవివాహిత పురుష అభ్యర్థులై ఉండటంతో పాటు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1997, జనవరి 2 నుంచి 2002, జూలై 1 ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కరోనా వైరస్ విజృంభణ వల్ల నేవీ ఎంట్రన్స్ టెస్ట్ జరగడం లేదు. అకడమిక్ మెరిట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు నెల 21వ తేదీ తర్వాత బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతాలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. మొదట ఈ ఉద్యోగాలకు 10 ఏళ్ల కాలపరిమితితో తీసుకుని ఆ తర్వాత నాలుగేళ్లు పొడించే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి కేరళ ఎజిమళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నాలుగు నెలల ఎస్ఎస్సీ ఐటీ శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Indian navy ssc officer recruitment 2021 apply online for 45 it officer posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com