Homeఎడ్యుకేషన్ఇండియన్‌ నేవీలో 350 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో..?

ఇండియన్‌ నేవీలో 350 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో..?

భారత నావికా దళం సెయిలర్‌ అక్టోబర్‌ 2021 బ్యాచ్‌ నోటిఫికేషన్‌ తాజాగా జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 19వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జులై 23 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 350 ఉద్యోగ ఖాళీలలో చెఫ్‌, హైజీనిస్ట్‌, స్టీవార్డ్‌ పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇండియన్‌ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్‌ 1, 2001 నుంచి సెప్టెంబర్‌ 30, 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 14,600 రూపాయలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీల కోసం రూ. 21,700 నుంచి 69,100 రూపాయల వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి మొదట రాత పరీక్షను నిర్వహిస్తారు. ఎవరైతే రాత పరీక్షలో పాస్ అవుతారో వారికి ఫిజికల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular