
ECIL Jobs Hyderabad 2021: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ చెందిన ఈ సంస్థ జూనియర్ ఆర్టిజన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మైసూరులో విధులు నిర్వహించాలి. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 జూనియర్ ఆర్టిజన్ ఖాళీల భర్తీ జరగనుంది. ఫిట్టర్ ట్రేడ్లో రెండేళ్ల ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్లో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఆగష్టు 31వ తేదీలోపు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈసీఐఎల్ జోనల్ ఆపీస్, ఎల్ఐసీ బిల్డింగ్, మల్లేశ్వరం, బెంగళూరు సెప్టెంబర్ 17వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనున్న నేపథ్యంలో ఈ జాబ్స్ కు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.